మైనర్ బాలుడిని పెళ్లాడి ఓ బిడ్డను కన్న మహిళ, అరెస్ట్
మహిళకు అప్పటికే పెళ్లి అయ్యింది. కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయింది. ఆ తర్వాత.. మాయ మాటలు చెప్పి.. 17ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకొని.. అతనితో ఒక బిడ్డను కూడా కనేసింది.
ఓ మహిళకు అప్పటికే పెళ్లి అయ్యింది. కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయింది. ఆ తర్వాత.. మాయ మాటలు చెప్పి.. 17ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకొని.. అతనితో ఒక బిడ్డను కూడా కనేసింది. ఆ బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ మహిళ(23) వాళ్ల ఇంటికి సమీపంలో ఉండే ఓ మైనర్ కుర్రాడిని వలలో వేసుకుంది. వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలీకుండా పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయ్యింది. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. యువతిని నిలదీశారు. కాగా.. తమకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని.. కాదని మీ అబ్బాయిని తీసుకొని వెళతాను అంటే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
దీంతో.. కాస్త వెనక్కి తగ్గిన ఆ బాలుడి తల్లిదండ్రులు.. తమ కుమారుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాగా.. వారి కుమారుడు కూడా వాళ్ల మాట వినకపోవడం గమనార్హం. సదరు మహిళకు.. మైనర్ బాలుడి వివాహం జరిగి సంవత్సరం కావడం గమనార్హం. ఇప్పుడు వారికి నాలుగు నెలల బిడ్డ కూడా ఉంది.
తమ కుమారుడిని ఆ మహిళ వశపరుచుకుందని.. ఆమె కారణంగా తమ కుమారుడు పదో తరగతి కూడా ఫెయిల్ అయ్యాడని బాలుడి తల్లి ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళను అరెస్టు చేశారు. పోస్కో చట్టం, లైంగిక వేధింపులు, బాల్య వివాహం తదితర చట్టాల కింద ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆమెకు నాలుగు నెలల బిడ్డ ఉండటంతో.. బిడ్డను కూడా ఆమెతో పాటు జైలులో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.