నకిలీ ఏసీబీ అధికారిని.. చెప్పుతో చితకబాదిన మహిళ
ఏసీబీ అధికారినంటూ చెలామణి అవుతున్న ఓ నకిలీ అధికారిని ఓ మహిళ చితకబాదింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా... చెప్పుతో చితకబాదింది.
ఏసీబీ అధికారినంటూ చెలామణి అవుతున్న ఓ నకిలీ అధికారిని ఓ మహిళ చితకబాదింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా... చెప్పుతో చితకబాదింది. ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వ్యక్తికి మహిళ సరిగ్గా బుద్ధి చెప్పిందంటూ... ఆమెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఏసీబీ అధికారినంటూ చెప్పి, ఫేక్ ఐడీతో ఝార్ఖండ్ లోని మ్యాంగోలో నివసించే ఓ మహిళను రూ.50 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు జంషెడ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అరుణ్ మెహతా తెలిపారు. అతను నకిలీ అధికారని గుర్తించిన మహిళ తగిన విధంగా బుద్ధి చెప్పింది. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.