Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్... తల్లిదండ్రుల లేని మేనకోడలిని వ్యభిచార గృహానికి అమ్మిన అత్త.. !

డబ్బుల కోసం తల్లిదండ్రులు లేని మేనకోడలిని వ్యభిచార కూపానికి అమ్మేసిందో మేనత్త. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటనలో పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. 

Woman selling her niece to brothel for money, man arrested, delhi - bsb
Author
First Published Mar 24, 2023, 1:37 PM IST

ఢిల్లీ : ఆడపిల్లల మీద జరుగుతున్న అకృత్యాల్లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సంచలన ఘటన హృదయాల్ని మెలిపెట్టేలా ఉంది. తల్లిదండ్రులు లేని తన మేనకోడలిని దగ్గరుండి కన్నకూతురుల సాదుకోవాల్సిన మేనత్త ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టింది.  మైనర్ బాలికను రూ. 55 వేల రూపాయలకు ఓ వ్యక్తికి అమ్మింది. అతను బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు. దీంతో తనను కొన్న వ్యక్తుల నుంచి బాధితురాలు ఎలాగో తప్పించుకొని ఓఎన్జీవోను  ఆశ్రయించింది. 

వారి సహకారంతో  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఢిల్లీలోని గోవింద్ పురి పోలీస్ స్టేషన్లో బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమె వాంగ్మూలం ప్రకారం మైనర్ బాలికను కొన్న నిందితుడైన నందుని అరెస్టు చేశారు. అతనికి మేనకోడలు అని కూడా చూడకుండా అమ్మిన అత్త పరారీలో ఉంది. సదరు బాధిత బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. ఎవరూ లేకపోవడంతో ఆ బాలిక మేనత్త దగ్గర ఉంటుంది. సోదరుడి కూతురిని కన్న కూతురులా చూసుకోవాల్సిన ఆమె డబ్బుల కోసం కక్కుర్తి పడింది. నందు అనే పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.55వేలకు ఆ బాలికను అమ్మేసింది.  

కోడలి కొంగు పట్టుకుని సహకరించిన అత్త.. నెట్టింట వైరల్ గా వీడియో.. ఇంతకీ అందులో ఏముందంటే..

అక్కడి నుంచి బాలికను తీసుకువెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లోనే  ఆమెతో వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు. ఈ మేరకు బాలిక తన వాంగ్మూలంలో తెలుపుతూ…‘తన మీద పదిమందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. ఈ క్రమంలోనే గత మంగళవారం కూడా ఓ వ్యక్తి బాలికను వేధించేందుకు రాగా.. అక్కడి నుంచి ఏదోలా తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత  ఓఎన్జీవో  అడ్రస్ సంపాదించి వారిని కలిసింది. వారికి తన బాధను వెల్లడించి సహాయం చేయాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులకు సమాచారం అందించిన ఎన్జీవో సభ్యులు.. నిందితుడైన నందును కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి చికిత్స నిమిత్తం పోలీసు అధికారులు ఆసుపత్రికి తరలించారు. 

బాధితురాలికి వైద్య పరీక్షలు చేసిన వైద్యుల బృందం ఆమె మీద అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించడంతో..  నిందితుల మీద అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. బాలికను కొని వ్యభిచారంలోకి దింపిన  నిందితుడైన నందును పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాలిక మేనత్త పరారీలో ఉంది.  దీంతో ఆమె మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios