Asianet News TeluguAsianet News Telugu

భర్త, కుమార్తె వద్దు.. ప్రియుడే ముద్దు.. అంటూ వెళ్ళిపోయి.. కట్ చేస్తే ఆదిపరాశక్తి అవతారంలో.. ట్విస్ట్ ఏంటంటే..

Chengalpattu జిల్లా తిరుప్పోరుర్ లోని కళ్యాణ మండపం వేదికగా అన్నపూర్ణ అరసు మాతాజీ జనవరి 1న దివ్యదర్శనం ఇస్తున్నారని.. భక్తులకు ఉపదేశం చేయనున్నారని.. సామాజిక మాధ్యమాల వేదికగా ఆహ్వానం పలికే వీడియో వైరల్ అవుతోంది.  ఈ మాతాజీ చుట్టూ భక్తులు ఆశీర్వచనాలు తీసుకోవడం, క్షణాల్లో ఆమె పూనకం వచ్చినట్టు ఊగిపోతూ భక్తుల కోరికలను తీర్చడం,  వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యాయి.  దీంతో పోలీసులు ఈ మాతాజీ ఎవరో ఆరా తీసే పనిలో పడ్డారు.

woman self claiming that her incamation adi parasakti in chennai
Author
Hyderabad, First Published Dec 28, 2021, 8:55 AM IST

చెన్నై :  గతంలో భర్త, కుమార్తెను వదిలి ప్రియుడే కావాలని రచ్చకెక్కిన ఓ మహిళ…. తాజాగా తాను ఆదిపరాశక్తి అవతారం అని చెప్పుకుంటూ తెరమీదకు రావడం స్థానికులను విస్మయంలో పడేసింది. పైగా అన్నపూర్ణ అరసు మాతాజీగా భక్తులకు కొత్త సంవత్సరం వేళ ఉపదేశం ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. దీంతో ఈ మాతాజీ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.

 వివరాల్లోకి వెళితే…Chengalpattu జిల్లా తిరుప్పోరుర్ లోని కళ్యాణ మండపం వేదికగా అన్నపూర్ణ అరసు మాతాజీ జనవరి 1న దివ్యదర్శనం ఇస్తున్నారని.. భక్తులకు ఉపదేశం చేయనున్నారని.. సామాజిక మాధ్యమాల వేదికగా ఆహ్వానం పలికే వీడియో వైరల్ అవుతోంది.  ఈ మాతాజీ చుట్టూ భక్తులు ఆశీర్వచనాలు తీసుకోవడం, క్షణాల్లో ఆమె పూనకం వచ్చినట్టు ఊగిపోతూ భక్తుల కోరికలను తీర్చడం,  వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యాయి.  దీంతో పోలీసులు ఈ మాతాజీ ఎవరో ఆరా తీసే పనిలో పడ్డారు.

 తెరమీదికి గత వివాదాలు…
2014లో ఓ టీవీ ఛానల్ వేదికగా జరిగిన చర్చలో తనకు భర్త, 14యేళ్ల కుమార్తె కన్నా ప్రియుడే ముఖ్యమని స్పష్టం చేసి అతనితో వెళ్ళిపోయిన అన్నపూర్ణే ఈ మాతాజీగా తేలింది. అలాగే గత వివాదాల వీడియోలు సైతం తెరమీదకు తెచ్చే సోషల్ మీడియా పోస్టులు కూడా భారీగానే పెరిగాయి. మరింత లోతుగా సాగిన విచారణలో ప్రియుడు అరసు గతంలో అనుమానాస్పదంగా మరణించినట్లు తెలిసింది.

 ఇక పోలీసుల రాకతో అన్నపూర్ణ, ఆమె భక్తులు పత్తా లేకుండా పారిపోయారు.  changalpattu పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, తమ సెల్ఫోన్లను స్విచాఫ్ చేసి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మాతాజీకి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

‘‘నాతో శృంగారం చేస్తే ... నా శక్తులన్నీ మీలో ప్రవేశిస్తాయి’’ : మహిళల్ని ట్రాప్, 11 మందితో దొంగ బాబా రాసలీలలు

ఇదిలా ఉండగా, ఇలాంటి ఫేక్ మాతాజీ ఘటన ఒకటి మేలో వెలుగు చూసింది. కరోనా సోకకుండా ఉండాలంటే కరిగించిన వెండిని తాగాలంటూ ఓ మాతాజి... తాగి మరణించింది. ఈ ఘటన వాషింగ్టన్ లో జరిగింది. 

అయితే మూఢభక్తిలో మునిగిన ఆమె శిష్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఓ బట్టలో చుట్టి.. చుట్టూ లైట్స్ తో డెకరేషన్ చేసి పూజిస్తున్నారు. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నపోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిష్యులను అరెస్ట్ చేశారు.

కొలరాడోలో జరిగిన ఈ వింత సంఘటన వివరాల్లోకి వెడితే.. అమి కార్లసన్ (45) అనే మహిళ ‘లవ్ హాస్ ఓన్’ అనే ఆధ్యాత్మిక సంస్థను నడుపుతోంది. శిష్యులందరూ ఆమెను ‘‘మదర్‌ ఆఫ్‌ గాడ్‌’’ అని పిలుస్తారు. కొద్ది రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో కార్లసన్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ కనిపించిన వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ఇంట్లో దాదాపు 10మంది వరకు శిష్యులున్నారు. కార్లసన్‌ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి, బాక్సులో పెట్టి ఉంది. దాని చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించి.. ఆమె గురించి భజనలు, పాటలు పాడుతూ కూర్చుని కనిపించారు.  

అది గమనించిన పోలీసులు వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకుని కార్లసన్ మృతదేమాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. పోస్ట్ మార్టంలో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. కార్లసన్ ఈ యేడాది మార్చిలోనే చనిపోయిందని పోస్ట్ మార్టం చేసిన వైద్యులు తెలిపారు. అంతేకాదు ఆమె ద్రవరూపంలో ఉన్న వెండిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల చనిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios