సహజీవనం : గదిలో బంధించి అత్యాచారం, చిత్రహింసలు.. ఆపై...
కేరళలో దారుణం చోటు చేసుకుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న యువతిని ఆమె సహచరుడే గదిలో బంధించి.. ఆపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు.. బాధిత యువతి, నిందితుడు గత కొన్నేళ్లుగా ఎర్నాకులం సిటీలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ ప్లాట్ లో సహజీవనం చేస్తున్నారు.
మనసులు, అభిరుచులు, అభిప్రాయాలు కలిసిన జంట... వేరే బంధాలతో పనిలేకుండా కలిసి చేసే జీవనప్రయాణమే సహజీవనం. అలాంటి అందమైన ప్రయాణాన్ని అత్యంత భయంకరంగా మార్చేశాడో కిరాతకుడు. తనను నమ్మి, ప్రేమించి వచ్చిన యువతికి నరకం చూపించాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో జరిగింది.
కేరళలో దారుణం చోటు చేసుకుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న యువతిని ఆమె సహచరుడే గదిలో బంధించి.. ఆపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు.. బాధిత యువతి, నిందితుడు గత కొన్నేళ్లుగా ఎర్నాకులం సిటీలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఓ ప్లాట్ లో సహజీవనం చేస్తున్నారు.
ఈ క్రమంలో నిందితుడు గత కొద్ది కాలంగా యువతిని చిత్రహింసలకు గురి చేయసాగాడు. బాధితురాలిని అవమానిస్తూ, ఆమెపై అత్యాచారం చేస్తూ హింసించేవాడు.
ఛూ.. మంతర్.. నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం : స్వామి నిత్యానంద...
అంతేకాదు ఈ టార్చర్ గురించి ఎవరికైనా చెబితే బాధితురాలి పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం నిందితుడి ఆగడాలు మరింత మితిమీరాయి. ఏకంగా బాధితురాలిని గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ తరువాత ఆమె మీద దాడి చేయడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని వేరే ప్రదేశంలో షెల్టర్ పొందుతున్నానని పోలీసులకు తెలిపింది. ఇక నిందితుడు తన దగ్గర్నుంచి ఇప్పటికే 5 లక్షల రూపాయలవరకు తీసుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి శరీరమంతా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లేసరికి.. నిందితుడు అప్పటికే పారిపోయాడు. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడని పోలీసులు తెలిపారు.