Asianet News TeluguAsianet News Telugu

ఒక్క రాత్రి ప్రియుడితో గడిపి.. ఉదయం అతని ఏడేళ్ల కొడుకుతో జంప్..

తండ్రితో గడపడానికి ఇంటికి వచ్చిన ఓ మహిళ ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. మూడు రోజుల తరువాత ఆ మహిళను పట్టుకున్నారు. 

woman kidnapped 7 years old boy after one-night stand with his father in Nagpur
Author
First Published Dec 16, 2022, 9:33 AM IST

నాగ్‌పూర్ : ఓ మహిళ తన ప్రియుడి కొడుకును కిడ్నాప్ చేసిన ఘటన నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. వన్ నైట్ స్టాండ్ తరువాత ఆ మహిళ తన కొడుకుతో పాటు, తన ప్రియుడి కొడుకును కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఈ మేరకు కిడ్నాప్ కేసు నమోదు కావడంతో పోలీసులు తీవ్రంగా గాలించి.. ఆమెను, కిడ్నాప్ అయిన బాలుడిని చింద్వారాలో పట్టుకున్నారు. అయితే కిడ్నాప్ జరిగిన రెండు రోజుల తరువాత గానీ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరలేదు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. శనివారం రేష్మా భివ్ గాడే, ఆకాష్ అనే ఇద్దరికీ ఓ టీ స్టాల్ లో పరిచయం అయ్యింది. వీరిద్దరూ దగ్గర్లోని కన్ స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. కానీ వారితో గొడవల కారణంగా విడిపోయరు. దీంతో ఇద్దరూ వన్ నైట్ స్టాండ్ కు ఇష్టపడ్డారు. అలా ఆకాష్ గదికి వెళ్లిన రేష్మా.. తెల్లారాక.. ఆకాష్ ఏడేళ్ల కొడుకును తనతో తీసుకుపోయింది. 

ఆకాష్ కు ముగ్గురు కొడుకులు. ఒక కొడుకు మంథన్ వాఘడే అతని దగ్గరుండగా.. మిగతా ఇద్దరు చిన్నవాళ్లు తల్లితో ఉన్నారు. ఆ రోజు రాత్రి వచ్చిన రేష్మా తెల్లారి వెడుతూ వెడుతూ.. ఆ చిన్నారినే తీసుకెళ్లింది. ఆ తరువాత అది గమనించిన ఆకాష్ రేష్మ చిన్నారిని సరదాగా అలా బైటికి తీసుకెళ్లిందని అనుకున్నాడు. అయితే రేష్మాకు కూడా పెళ్లై భర్తతో విభేదాల కారణంగా విడగా ఉంటోంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఇద్దరినీ తీసుకుని ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది.

తల్లితో సింహం పిల్లల సయ్యాటలు.. తెల్ల సింహానికి నెటిజన్లు ఫిదా..

రేష్మా, ఆకాష్ ఇద్దరి దగ్గరా ఫోన్లు లేవు. దీంతో కాంటాక్ట్ చేయడం కుదరలేదు. రేష్మ తిరిగి వస్తుందని ఆకాష్ ఎదురుచూస్తున్నాడు. ఇంతలో రెండు రోజుల తరువాత ఆకాష్ భార్య కొడుకును చూడడానికి వచ్చింది. కొడుకు రెండు రోజులనుంచి కనిపించడం లేదని తెలిసి భర్త మీద విరుచుకుపడింది. అతడిని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లింది. 

అక్కడ కిడ్నాప్ కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలించడం మొదలు పెట్టారు. 40 గంటల తరువాత చింద్వారాలో ఓ చోట ఇసుకలో ఆడుకుంటున్న మంథన్ వాఘడేను గమనించిన పోలీసులు.. దగ్గర్లో రేష్మాను కూడా కనిపెట్టి.. ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అయితే, ఈ కేసులో రేష్మా కావాలని చిన్నారిని తీసుకువెళ్లలేదని తెలిసింది. 

పిల్లలిద్దరినీ సరదాగా బైటికి తీసుకువెళ్లిన రేష్మా ఆ తరువాత ఆకాష్ గదికి దారి మరిచిపోయింది. నాగ్‌పూర్‌లోని శతాబ్ది చౌక్‌లో బాలుడి ఇంటికి తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నా.. ఆమెకు దారి తెలియలేదు. కాబట్టి, భివ్‌గాడే మంథన్‌ని చింద్వారాలోని తన స్వస్థలానికి తీసుకెళ్లింది. ఈలోగా, మంథన్ తల్లి సోమవారం ఆకాష్‌ను కలవడానికి వచ్చి, తన కొడుకు గత రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో కంగుతిన్నాడు. ఆమె ఆకాష్‌ను బెల్తరోడి పోలీస్ స్టేషన్‌కు లాగింది, అక్కడ కిడ్నాప్ నేరం నమోదైంది. భివ్‌గాడే, బాలుడి కోసం జోనల్ డీసీపీ విజయకాంత్ సాగర్ ఆధ్వర్యంలో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.

రేష్మా కూడా పోలీసులకు ఈ విషయం చెప్పాలని అనుకుందని అయితే, ఆమెకు పోలీస్ స్టేషన్ దారి తెలియలేదని తెలిసింది. మంగళవారం, ఆమె రైలులో నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చి ఆటోరిక్షాలో శతాబ్ది చౌక్‌కు వెళ్లింది. అప్పటికే భివ్‌గాడే కోసం వెతుకుతున్న పోలీసులు, రోడ్డు పక్కన ఇసుక కుప్పపై ఆడుకుంటున్న మంథన్‌ను గమనించారు. భివ్‌గాడే కూడా సమీపంలోనే ఉన్నాడు. పోలీసులు వెంటనే భివ్‌గడేను చుట్టుముట్టి మంథన్‌ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. రేష్మా మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios