Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజధాని‌లో షాకింగ్ ఘటన.. రైల్వే స్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. నలుగురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో శుక్రవారం 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధిచి పోలీసులు నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు. 

Woman gang raped inside New Delhi railway station 4 railway employees Arrested
Author
First Published Jul 23, 2022, 11:25 AM IST


దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో శుక్రవారం 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధిచి పోలీసులు నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు బాధిత మహిళపై అత్యాచారం జరపగా.. మరో ఇద్దరు గది వెలుపల కాపలాగా ఉన్నారు. నిందితులను సతీష్ కుమార్ (35), వినోద్ కుమార్ (38), మంగళ్ చంద్ మీనా (33), జగదీష్ చంద్ (37)గా గుర్తించారు. వీరు నలుగురు రైల్వేలోని  ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రెండు గంటల్లోనే నలుగురు నిందితులను అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వే) హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచామని.. కోర్టు ఆదేశాలతో వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపామని చెప్పారు. ‘‘జూలై 22న తెల్లవారుజామున 3.27 గంటలకు మాకు కాల్ వచ్చింది. అందులో రైల్వే స్టేషన్‌లోని గదిలో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది. విచారణలో.. రైలు లైటింగ్ గుడిసెలో ఈ సంఘటన జరిగినట్లు మేము కనుగొన్నాం’’ అని డీఎస్పీ హరేంద్ర కుమార్ సింగ్ చెప్పారు. 

ఇక, తాను గత ఏడాది కాలంగా తన భర్తతో విడిగా ఉన్నానని.. విడాకుల దరఖాస్తు కోర్టులో పెండింగ్‌లో ఉందని బాధిత మహిళ పోలీసులకు సమాచారం అందించిందని సింగ్ చెప్పారు. ‘‘దాదాపు రెండేళ్ల క్రితం మహిళకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నిందితుల్లో ఒకరితో పరిచయం ఏర్పడింది. అతడు.. తాను రైల్వే ఉద్యోగినినని ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. వారు ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించారు. జూలై 21న కొడుకు పుట్టినరోజు పార్టీకి ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. 

నిందితులు రాత్రి 10.30 గంటల సమయంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్ నుంచి మహిళను ఎక్కించుకుని రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సిబ్బంది కోసం రైలు లైటింగ్ గుడిసెలో కూర్చోమని ఆమెను అడిగారని మహిళ ఆరోపించింది. కొన్ని నిమిషాల తర్వాత.. నిందితుడు తన స్నేహితుడితో కలిసి గది లోపలికి వచ్చి బోల్ట్ చేశాడు. వారు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అతని సహచరులలో ఇద్దరు బయటి నుండి గదిని కాపలాగా ఉంచడం ద్వారా వారి పని సులభతరం చేశారు’’ అని  డీఎస్పీ హరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios