కట్టుకున్న భార్య పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. భార్యపై అతను అత్యాచారం చేయడంతోపాటు... తన కుటుంబసభ్యులతో కూడా అత్యాచారం చేయించాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది.
కట్టుకున్న భార్య పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. భార్యపై అతను అత్యాచారం చేయడంతోపాటు... తన కుటుంబసభ్యులతో కూడా అత్యాచారం చేయించాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... మొహాలికి చెందిన ఓ వివాహిత భర్త అమర్జీత్ సింగ్ మత్తుమందుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో రోజూ ఆమెను హింసించేవాడు. దీనిని అలుసుగా తీసుకున్న అతడి తండ్రి అవతార్ సింగ్, బాబాయిలు(జస్పాల్ సింగ్, గుర్మెయిల్ సింగ్) కోడలి పట్ల మృగాళ్లలా ప్రవర్తించారు. కొడుకుతో పాటు బాధితురాలికి కూడా మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయం బయటకు చెబితే... చంపేస్తామంటూ యువతిని బెదిరించారు. కొద్ది రోజులుగా నరకం అనుభవిస్తున్న ఆమె ఎలాగోలా ఆ రాక్షసుల నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. తన పుట్టింటి వారి సహాయంతో... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారే తప్ప.. ఇప్పటి వరకు కేసులో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. దీంతో.. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 30, 2019, 12:56 PM IST