లాక్డౌన్ కాలంలో నలుగురూ ఇంటి వద్దనే వుండటంతో ఆన్లైన్ ఆటలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఏ ఇద్దరి నుంచి నలుగురు ఆడుకునే ‘లూడో’ గేమ్ అయితే బాగా పాపులర్ అయ్యింది.
లాక్డౌన్ కాలంలో నలుగురూ ఇంటి వద్దనే వుండటంతో ఆన్లైన్ ఆటలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఏ ఇద్దరి నుంచి నలుగురు ఆడుకునే ‘లూడో’ గేమ్ అయితే బాగా పాపులర్ అయ్యింది.
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతి లూడో ఆటలో తండ్రి తనను మోసం చేశాడంటూ ఏకంగా కోర్టును ఆశ్రయించింది.
గెలిపిస్తాడని నమ్మానని, కానీ తన పావుల్నే చంపేశాడని.. తండ్రితో సంబంధాన్ని తెంచేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తోబుట్టువులు, తండ్రితో ఆడిన ఆటలో తండ్రి తనను గెలిపిస్తాడని భావించానని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ కోర్టుకు తెలిపింది.
తనలో సంతోషాన్ని నింపేందుకు ఆయన ఓడిపోయి నన్ను గెలిపిస్తాడని నమ్మకం పెట్టుకున్నానని, కానీ అలా చేయలేదని పేర్కొంది.
దీంతో తండ్రిపై ఉన్న గౌరవమంతా పోయిందని, ఆయనతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని భావిస్తున్నట్లు ఫిర్యాదులో వెల్లడించింది. సదరు యువతి మానసిక పరిస్థితిపై అనుమానం వచ్చిన కోర్టు కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
