వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య దారుణానికి తెగబడింది. ప్రియుడితో కలిసి.. భర్తకు మద్యం తాగించి... ఆ తరువాత ఇనుపతీగతో గొంతు కోసం హత్య చేసింది. 

పశ్చిమ బెంగాల్ : హుగ్లీలోని ధనియాఖలి గ్రామంలో ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రేమికుడు దారుణంగా murder చేశారు. బాధితుడు liquor మత్తులో ఉన్న సమయంలో ఇనుప తీగతో గొంతుకోసి హత్య చేశారు. చంపా మాల్, ఆమె ప్రేమికుడు బేచారం మాలిక్ తో కలిసి తన భర్త నితిన్ సనాతన్ మాల్ (46)ని వదిలించుకోవడానికి వేసిన పథకంలో భాగంగా ఈ సంఘటన జరిగింది.

ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఫుల్లుగా మద్యం తాగించింది. అతడు తాగీ తాగీ పూర్తిగా మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదనుగా భార్య, ప్రియుడిని పిలిచి.. ఇనుప తీగతో భర్త గొంతు బిగించి హత్య చేశారు. ఆ తరువాత తమ నేరాన్ని కప్పిపుచ్చడానికి, సనాతన్ మాల్ మృతదేహాన్ని ఒక సంచిలో వేసి బావిలో పడేశారు.

అయితే, బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోనుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్‌మార్టం కోసం పంపించారు. కేసు దర్యాప్తులో మొదట వారికి ఎలాంటి క్లూ లభించలేదు.. ఈ క్రమంలో పోలీసులకు చంపపై అనుమానం వచ్చింది.

ధనియాఖలి స్టేషన్‌కు చెందిన నిరుపమ్ మండల్ ఇన్‌ఛార్జ్ అధికారి మాట్లాడుతూ, "మేము చంపాను విచారించడం ప్రారంభించినప్పుడు, మొదట ఆమె ఒప్పుకోలేదు.. ఆ తరువాత నెమ్మదిగా భర్తను ఎలా? ఎందుకు చంపింది.. చెప్పుకొచ్చింది’’.. అన్నారు. 

ఇదిలా ఉండగా, ఓ మహిళతో extramarital affair కారణంగా ఓ యువకుడిని murder చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియడంతో అతను నేరుగా courtలో లొంగిపోయాడు. నిందితుడిని కస్టడీలో తీసుకున్న పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సిఐ శ్రీధర్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాతంరాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇంట్లో బీహార్కు చెందిన రాహుల్ అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు మహిళ ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. ఈ క్రమంలో ఆమెకు బీహార్కు చెందిన రేణు అలియాస్ రాను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కూడా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే సాతంరాయిలో ఉంటున్న రాహుల్ తరచూ సదరు మహిళను కలవడంతో పాటు ఫోన్ లో మాట్లాడేవాడు. దీనిని గమనించిన రేణు అతనితో గొడవ పడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని ఇద్దరిని హెచ్చరించి పంపించారు. నిరుడు డిసెంబర్ లో కొండపల్లి కి వచ్చిన రాహుల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీనిని గుర్తించిన అతడిని వెంబడించి వెనకనుంచి రాయితో తలపై గట్టిగా కొట్టడంతో ట్రాక్ మధ్యలో బోర్లా పడిపోయాడు. రాహుల్ చనిపోయినట్లు గుర్తించిన రేణు బీహార్ కు పారిపోయాడు.

కేసు మార్పిడితో…
అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెల ఈ కేసును రైల్వే పోలీసులు శంషాబాద్ పీఎస్ కు బదిలీ చేయడంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రేణు కోసం బీహార్ వెళ్లగా అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన రేణఉ ఏప్రిల్ 25న రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో రేణును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఆదివారం సంఘటనా స్థలం వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరు పరిచారు.