గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించేందుకు అక్కడ బాంబును పెట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
రైలు పట్టాలపై దుండగులు బాంబుని ఏర్పాటు చేసిన సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఉత్తర 24పరగణాల జిల్లాలోని రైల్వే ట్రాక్ పై బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించేందుకు అక్కడ బాంబును పెట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
కాగా.. దానిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి.. దానిని బాంబుగా గుర్తించారు. వెంటనే బాంబు స్వ్కాడ్ ని పిలిపించి.. దానిని నిర్వీర్యం చేశారు. అప్పటి తో భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.
దీని కారణంగా కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాంబుని నిర్వీర్యం చేసిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 9, 2019, 1:06 PM IST