బీజేపీ ఎంపీ అర్జున్ షింగ్ ఇంటిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. బాంబులు వేయడంతో వారు ఆగలేదు. తుపాకీలతో కొద్ది సేపు కాల్పులు జరిపారు.
ఓ బీజేపీ ఎంపీ ఇంటిపై కొందరు ఆగంతకులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ పరిగణాన్ జిల్లాలో చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అర్జున్ షింగ్ ఇంటిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. బాంబులు వేయడంతో వారు ఆగలేదు. తుపాకీలతో కొద్ది సేపు కాల్పులు జరిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

అదృష్టం ఏమిటంటే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా... దాడికి పాల్పడింది ఎవరూ అన్న విషయం మాత్రం తెలియలేదు. ఈ ఘటనపై ఎంపీ ఫిర్యాదు మేర పశ్చిమబెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ ఇంటి ముందు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనలో ఎవరి హస్తముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
