Kolkata: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరడజను దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో ఓ దుకాణదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బిధాన్‌నగర్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్‌బోస్‌, బిధాన్‌నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.  

Massive fire breaks out in Salt Lake market: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని జుప్రీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది వీలైనంత త్వరగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్‌బోస్‌, బిధాన్‌నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం.. కోల్ కతాలోని పుట్ ఖాక్ బజార్ లోని సాల్ట్ లేక్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో కనీసం ఆర‌డ‌జ‌నుకు పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి, డజన్ల కొద్దీ దాని ప్రభావానికి గురయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంటల్లో ఒక దుకాణదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బిధన్ నగర్ డివిజనల్ ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్, బిధన్ నగర్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ అగ్నిప్ర‌మాదం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌లేదు. 

ఎఫ్ డి బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయని స్థానికులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్, బిధన్ నగర్ పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో సాల్ట్ లేక్ ఎపిడి బ్లాక్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఆ మార్కెట్ లో వందలాది గుడిసెల దుకాణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అగ్నికి ఆహుతైంది. మండే స్వభావం ఉన్న పదార్థాలు ఆ దుకాణాల్లో నిల్వ చేయబడ్డాయి. ఈ క్ర‌మంలోనే ఆ దిశ‌గా గాలి వీయ‌డం మంటలు మరింత త్వరగా వ్యాపించడానికి కార‌ణమైంది. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

మంగ‌లు వేగంగా వ్యాపించ‌డంతో ఆర‌డ‌జ‌నుకు పైగా దుకాణాలు మంట‌ల్లో కాలిపోయాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం తొమ్మిది ఇంజిన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మంటలు కొద్దిగా అదుపులోకి వచ్చినట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున మార్కెట్ ఎక్కువగా ఖాళీగా ఉండటంతో ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు. అయితే అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. 

Scroll to load tweet…