IMD: ఈ వారంలో చివరివరకు జమ్మూ, లడఖ్, కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు చాలా విస్తృతంగా మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి.
weather update: దేశంలోని అనేక రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గుదల నమోదవుతుండగా, కొండ ప్రాంతాల్లో మంచు కురవడం షురు అయిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనితో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షపు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీలో శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అలాగే, శుక్రవారం నుంచి హిమాలయ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న మైదాన ప్రాంతాల్లో తాజా పాశ్చాత్య వాతావరణం ప్రభావం చూపుతుందని పేర్కొంది.
తమిళనాడు, పరిసర ప్రాంతాలపై తుఫాను ప్రసరణ ప్రభావం ఉందనీ, దిగువ-మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈ వ్యవస్థ నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి నడుస్తోందని ఐఎండీ తెలిపింది. ఇది ఈశాన్య గాలులు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ని ఆనుకుని ఉన్న తీరప్రాంతాల వెంబడి-దాని వెలుపల ఉన్నాయి. "ఈ పరిస్థితులలో, విస్తారమైన తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం, పలు చోట్ల భారీ వర్షపాతం, ఉరుములు/మెరుపులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉంది..." అని ఐఎండీ తెలిపింది. ఈ వారంలో చివరివరకు జమ్మూ, లడఖ్, కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు చాలా విస్తృతంగా మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్లో శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు-మంచు కురిసే అవకాశం ఉంది.
ఇదిలావుండగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చలి తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గురువారం (నవంబర్ 3న) దేశరాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో, ఉదయం తేలికపాటి పొగమంచు ఉంటుంది. ఇదే సమయంలో ఢిల్లీలో కాలుష్యంగా అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆనంద్విహార్ స్టేషన్లో సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో AQI 429 రికార్డ్ చేయబడింది. ఇది తీవ్రమైన విభాగంలో వస్తుంది. వాతావరణ శాఖ ప్రకారం, నవంబర్ 5 మరియు 8 మధ్య, ఢిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఘజియాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో AQI 321 గత సాయంత్రం ఘజియాబాద్లోని ఇందిరాపురం స్టేషన్లో రికార్డ్ చేయబడింది. వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకారం.. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కోస్టల్ తమిళనాడులో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు- మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంది.
వర్షం కారణంగా పాఠశాల మూత..
గత కొన్ని రోజులుగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైక్కల్, కడలూరు, మైలాడుతురై, విల్లుపురం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
శీతాకాలం ఎప్పుడు వస్తుంది?
నవంబర్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. నవంబర్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల గురించి ప్రస్తావించారు.