ఉత్తరభారతాన్ని ముంచెత్తిన పొగమంచు.. రైళ్లు, విమానాల రాకపోకలు ఆలస్యం
New Delhi: ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో దట్టమైన పొగమంచు చుట్టుముట్టేయడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలోనే చాలా విమానాలు ఆలస్యం కాగా, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వివిధ రాష్ట్రాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లలో రాబోయే 24 గంటలపాటు దట్టమైన పొగమంచు ఉంటుంది.
Weather Update: దేశంలో చలి తీవ్రత పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో దట్టమైన పొగమంచు చుట్టుముట్టేయడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలోనే చాలా విమానాలు ఆలస్యం కాగా, పలు రైళ్లు రద్దు అయ్యాయి. వాతావరణ శాఖ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్లలో రాబోయే 24 గంటలపాటు దట్టమైన పొగమంచు ఉంటుంది.
ఐఎండీ రిపోర్టుల ప్రకారం..
పంజాబ్-హర్యానాలో వర్షాలు పడే అవకాశం ఉంది..
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జనవరి 11 నుంచి 14 మధ్య హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనితో పాటు, జనవరి 11, 12 మధ్య హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో మంచు కురిసే అవకాశం ఉంది.
బీహార్లో చలి తీవ్రత, 6 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
బీహార్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలిని తట్టుకునేందుకు ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. పాట్నా, భాగల్పూర్, ముజఫర్పూర్, ఛప్రా, అరారియా, మోతిహారిలలో చలిగాలుల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
పశ్చిమ యూపీని చుట్టేసిన పొగమంచు..
పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగ్రా, తూర్పు ఉత్తరప్రదేశ్లోని వారణాసి/బాబత్పూర్, బహ్రైచ్, సుల్తాన్పూర్, లక్నోలతో పాటు బీహార్లోని గయా, భాగల్పూర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వీటితో పాటు సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్, బాగ్డోగ్రా, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో విజిబిలిటీ పడిపోయింది.
జమ్మూ విమానాశ్రయానికి వచ్చే ఆరు విమానాలు రద్దు
జమ్మూ డివిజన్లోని మైదాన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు, మేఘాల కారణంగా జమ్మూ విమానాశ్రయానికి వచ్చే ఆరు విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి జమ్మూ వస్తున్న విమానాన్ని విమానంలో వెనక్కి పంపారు.
ఢిల్లీలో పొగమంచు కారణంగా 45 విమానాలు ఆలస్యం
ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 45 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు ఏ విమానం మళ్లింపు గురించి సమాచారం లేదు. పొగమంచు, చలిగాలుల మధ్య, ఇప్పుడు ఢిల్లీలో గాలి నాణ్యత 421 AQIతో తీవ్ర విభాగంలోకి జారుకుంది.
పొగమంచు కారణంగా 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి..
ఉత్తర భారతదేశం మొత్తం పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే జోన్లో 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
శ్రీనగర్లో ఉష్ణోగ్రత సున్నా కంటే దిగువకు చేరుకుంది
శ్రీనగర్ను దట్టమైన పొగమంచు ఆవరించింది. ఇక్కడ ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉంది. చలిని తట్టుకునేందుకు ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు.
ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్..
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలుల మధ్య ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో బుధవారం ఉదయం 6.10 గంటలకు 5.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో పాలెం ప్రాంతంలో 100 మీటర్ల మేర విజిబిలిటీ నమోదైంది.