Asianet News TeluguAsianet News Telugu

2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో క‌లిసి న‌డుస్తాం: త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్

Tamil Nadu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డీఎంకే ప్రస్తుత పొత్తును కొనసాగిస్తుందని త‌మిళ‌నాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఓడించవచ్చనీ, అంద‌రూ క‌లిసి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
 

We will work with Congress in 2024 general elections also: Tamil Nadu CM MK Stalin
Author
First Published Sep 20, 2022, 5:18 PM IST

Tamil Nadu Chief Minister M.K. Stalin: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు ఇతర కూటమి భాగస్వాములతో ప్రస్తుత పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మంగళవారం అన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఓడించవచ్చనీ, అంద‌రూ క‌లిసి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. డీఎంకే త‌మిళ‌నాడులో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు MDMK, దళిత పార్టీ అయిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) వంటి పార్టీలతో రాజకీయ కూటమిలో కొన‌సాగుతోంది. 

స్థానిక తమిళ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఎంకే. స్టాలిన్.. బీజేపీ, దాని సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి తాను ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని కాదని అన్నారు. దివంగత డీఎంకే నాయ‌కుడు, ఆయ‌న తండ్రి ఎం కరుణానిధి వార‌సుడిగా త‌న ప్ర‌యాణం గురించి త‌న‌కు స్ప‌ష్ట‌త ఉన్న‌ద‌ని స్టాలిన్ పేర్కొన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో ఓడించవచ్చని చెప్పారు. మే 2021 నుండి 16 నెలల పాలనలో తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా ఆయన మాట్లాడారు. కొన్ని చిన్న సంఘటనలు మినహా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పరిపూర్ణంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో మంచి పెట్టుబడి వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం ప్రభుత్వం అన్ని పర్యావరణ వ్యవస్థలను అందిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. 

ప్రభుత్వం సరైన దారిలో నడుస్తోందని, విమర్శల కోసమే విమర్శలు చేస్తున్నారని స్టాలిన్ అన్నారు. తమ పార్టీకి సంబంధించినంత వరకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కలయికతో ఏ మాత్రం పొత్తు ఉండదని డీఎంకే నాయ‌కుడు స్ప‌ష్టం చేశారు. 

అలాగే, "నాపదవీకాలాన్ని స్టాలిన్ పాలన అని పిలవాలని నేను కోరుకోవడం లేదు, కానీ దానిని ద్రవిడన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అని పిలవాలని కోరుకుంటున్నాన‌ని" ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో  స్టాలిన్ చెప్పారు. "ఈ ప్రభుత్వం ద్రవిడన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అని పిలవబడాలని నేను కోరుకుంటున్నాను, అంటే అన్నా-కలైంజ్ఞర్ పాలన సహకారం" అని స్టాలిన్ వరుసగా CN అన్నాదురై-ఎం కరుణానిధిని ఉద్దేశించి అన్నారు. "ప్రతిఒక్కరికీ ప్రతిదీ అనేది ద్రవిడన్ మోడల్ పాలన  ప్రధాన నినాదం" అని ఆయన అన్నారు. ద్రావిడ నమూనా సిద్ధాంతాలలో సామాజిక న్యాయం కూడా ఒకటిగా ఉంటుంద‌ని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.“ద్రావిడ సంస్థలో సామాజిక న్యాయం అంతర్లీనంగా ఉంది. రిజర్వేషన్ల వల్ల పేదలు, అణగారిన వర్గాల వారికి విద్య, ఉద్యోగాలు రావడంతో వారి జీవితాలు బాగుపడ్డాయి. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాల సమ్మిళిత వృద్ధి. తమిళనాడులోని ప్రజలందరినీ కలుపుకొని పోయే ప్రభుత్వంగా కూడా త‌మ‌ ప్రభుత్వం ఉంటుంది. అన్ని వర్గాలకు సమాన నిష్పత్తిలో ఎదుగుదల ద్రావిడ పాలనా నమూనా అని ఆయన అన్నారు.

అలాగే,  2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుండి మొత్తం 40 లోక్‌సభ స్థానాలను డీఎంకే గెలుచుకుని కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి "పోల్ పొజిషన్" తీసుకుంటుందని కూడా స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios