Asianet News TeluguAsianet News Telugu

అంగుళం భూమిని కూడా వ‌దులుకోం.. క‌ర్నాట‌క-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు వివాదంపై దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కీల‌క వ్యాఖ్యలు

Mumbai: అంగుళం భూమి కోసం కూడా మహారాష్ట్ర పోరాడుతుందని సరిహద్దు వివాదం గురించి రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి దేవేంద్ర‌ ఫడ్నవీస్ అన్నారు. మ‌హారాష్ట్ర శాసనసభలో ఫడ్నవీస్ మాట్లాడుతూ, కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రజలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని అన్నారు.
 

We will not give up even an inch of land; Devendra Fadnavis's key remarks on Karnataka-Maharashtra border dispute
Author
First Published Dec 26, 2022, 3:32 PM IST

Karnataka-Maharashtra Border Dispute: కర్ణాటకతో సరిహద్దు వివాదం ముదురుతున్న నేపథ్యంలో అంగుళం భూమి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం అన్నారు. మహారాష్ట్ర శాసనసభలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రజలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని అన్నారు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం సోమవారం ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో హాట్ టాపిక్ గా  నిలిచింది. ఈ అంశంపై తీర్మానం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దక్షిణాది రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలనీ, పొరుగు రాష్ట్రానికి ఒక్క అంగుళం భూమిని ఇవ్వకూడదని తీర్మానిస్తూ మహారాష్ట్రతో సరిహద్దు వివాదంపై కర్ణాటక శాసనసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీని త‌ర్వాత మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. 

మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని ఖండిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. సోమవారం, మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ, ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్, మొదటి వారంలో ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని వ్యాపార సలహా కమిటీలో నిర్ణయించినప్పుడు సరిహద్దు వివాదంపై ప్రభుత్వం  శీతాకాల స‌మావేశాల్లో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. తీర్మానాన్ని తరలించే ప్రతిపాదన కూడా సోమవారం  జాబితాలో లేదని ఆయన ఎత్తి చూపారు. కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు మహారాష్ట్ర గౌర‌వాన్ని   దెబ్బతీశాయని పవార్ అన్నారు. 

స్పీకర్ రాహుల్ నర్వేకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు జయంత్ పాటిల్ ను గురువారం మిగిలిన సెషన్ లో సస్పెండ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ, పరిస్థితి అనుకూలంగా లేనందున గత వారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టలేద‌ని డిప్యూటీ సిఎం ఫడ్నవిస్ చెప్పారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీలో ఉన్నారనీ, అందువల్ల తీర్మానం సభలో ప్రవేశపెట్టలేకపోయారని ఫడ్నవీస్ చెప్పారు. అంత‌కుముందు  సరిహద్దు వివాదంపై సోమవారం లేదా మంగళవారం తీర్మానం ప్రవేశపెడతామని ఆయన సభకు హామీ ఇచ్చారు. 'మేం ఒక్క అంగుళం వ‌దులుకోకుండా పోరాడతాం. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రజల న్యాయం కోసం మేము చేయగలిగినదంతా చేస్తాము" అని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని ఆయన అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్) మాట్లాడుతూ కర్ణాటక పీఎం రెచ్చగొట్టే పదజాలాన్ని ఉపయోగిస్తున్నారనీ, మహారాష్ట్ర ప్రభుత్వం భాషా మైనారిటీల కమిషన్ కిందకు వచ్చే కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమస్యను పరిష్కరించాలని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నిస్తుంటే మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షకపాత్ర వహించకూడదని చవాన్ అన్నారు. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) సభ్యుడు భాస్కర్ జాదవ్..  మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరాఠీ మాట్లాడే జనాభా ప‌ట్ల అసభ్యంగా ప్రవర్తించిన సందర్భంలోనూ నిస్సహాయంగా మారారని ఆరోపించారు. అయితే, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిలను నిస్సహాయులుగా మార్చే దమ్ము ఎవరికీ లేదని ఫడ్నవీస్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios