UP elections 2022: "మేము దీన్ని నిర్ణయించలేము.. కానీ కార్యకర్తలు కోరుకుంటేనే": రాహుల్ గాంధీ పంజాబ్ సర్ప్రైజ్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం పంజాబ్లోని జలంధర్ వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు. అయితే ఈ ర్యాలీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూను మరోసారి సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తుందని, ఇందుకు కార్యకర్తలే నిర్ణయం తీసుకుంటారని జాతీయ పార్టీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.
పంజాబ్లో త్వరలో ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తుందని, ఇందుకు కార్యకర్తలే నిర్ణయం తీసుకుంటారని జాతీయ పార్టీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. నవజ్యోత్ సిద్ధూ వర్సెస్ చరణ్జిత్ సింగ్ చన్నీ మధ్య పోటీ వచ్చే నెల పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారాన్ని దెబ్బతీస్తుందని "ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు, ఒక్కరే నాయకత్వం వహించగలరు" అని నొక్కి చెప్పారు.
‘ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలనే మీ డిమాండ్ను వీలైనంత త్వరగా నెరవేరుస్తాం.. సాధారణంగా మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించము..కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటే ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తాం..ఇందుకు కాంగ్రెస్ కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతాం.. వారే నిర్ణయిస్తారు. ," అని ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించడానికి పంజాబ్ పర్యటనలో అన్నారు.
ఫిబ్రవరి 20 ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పార్టీ గతంలోనే చెప్పింది. ఇద్దరు నాయకత్వం వహించలేరు, ఒకరు మాత్రమే నాయకత్వం వహించగలరు. ఒకరు నాయకత్వం వహిస్తే, మరొకరు మద్దతును అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఆలోచనలు ఉన్నాయి.పంజాబ్కు ఇప్పుడు కావలసింది శాంతి, సోదరభావం అని రాహుల్ గాంధీ అన్నారు.
అయిత్ ర్యాలీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూను మరోసారి సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ 70 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆన్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జీ సింగ్ చన్నీను కూడా పదవిని త్యాగం చేయాలని అన్నారు. దీంతో పంజాబ్కు మంచి ప్రభుత్వాన్ని అందించడానికి నేను త్యాగం చేస్తానని చెప్పారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాహుల్ ముందు మూడు డిమాండ్లు ఉంచారు అలాగే పంజాబ్లో తన ఎజెండాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జలంధర్లో జరిగిన ర్యాలీలో నవజ్యోత్ సిద్ధూ మాట్లాడుతూ పంజాబ్లో మార్పు కనిపిస్తోంది. పంజాబ్ నుండి మాఫియా నిర్మూలించబడుతుంది. పంజాబ్ను రుణ విముక్తులను చేస్తామన్నారు. ఇప్పుడు కొత్త వ్యవస్థను తీసుకురావడానికి పాత వ్యవస్థ మార్చబడుతుంది అలాగే కొత్త పంజాబ్ ఏర్పాటు చేయబడుతుంది అని అన్నారు.
సీఎం చన్నీ మాట్లాడుతూ మంచి ప్రభుత్వం రావాలంటే ప్రాణత్యాగమైన చేస్తానన్నారు. మీరు నాకు ఏ బాధ్యత అప్పగించినా నేను కాపాడుకుంటాను. పంజాబ్ను ముందుకు తీసుకెళ్తాం, మాఫియాను అంతం చేస్తాం. నాకు ఎలాంటి పదవి అవసరం లేదు అని చెప్పారు. రాహుల్ జీ, మీరు ఎవరి అయిన ముందుకు తీసుకురండి, మేము కలిసి నడుస్తాము. బ్రిటిష్ వారు దేశాన్ని దోచుకోవడానికి యూకే నుంచి వచ్చినట్లే కేజ్రీవాల్ పంజాబ్ను దోచుకోవడానికి వచ్చారు. వీరు నల్ల ఆంగ్లేయులు అని అన్నారు.