WAVES సమ్మిట్ 2025 కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశ విదేశాలకు చెందిన కళా, సంగీత, వ్యాపార రంగాల ప్రముఖులతో చర్చించారు.

WAVES సమ్మిట్ 2025 : వరల్డ్ ఆడియో-విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES 2025) గురించి చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశవిదేశాలకు చెందిన సినీ, వ్యాపార ప్రముఖులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడానికి మోదీ ప్రభుత్వం భావిస్తోంది... ఇందుకోసం WAVES 2025ను నిర్వహిస్తోంది. ఇలా ఇండియాను 'ఎంటర్టైన్మెంట్ రంగం యొక్క దావోస్'గా మార్చాలని కేంద్రం యోచిస్తోంది.

WAVES సమ్మిట్: భారతదేశం యొక్క గ్లోబల్ ఈవెంట్

WAVES సమ్మిట్‌ను భారతదేశం యొక్క అతిపెద్ద గ్లోబల్ ఈవెంట్‌గా ప్రదర్శిస్తున్నారు. ఇది వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ఈ సమ్మిట్ యొక్క సలహా మండలిలో భారతదేశానికే చెందినవారు కాకుండా విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.

ప్రముఖులతోసమావేశం తర్వాత ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికన స్పందించారు. WAVES సలహా మండలి సమావేశం ముగిసింది.. ఈ గ్లోబల్ సమ్మిట్ వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి గొప్ప ప్రయత్నమని అన్నారు. సలహా మండలిలో సభ్యులుగా వున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా దేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా ఎలా మార్చవచ్చనే దానిపై కీలక సూచనలు కూడా ఇచ్చారని తెలిపారు. 

WAVES ఎందుకు ప్రత్యేకం?

WAVES సమ్మిట్ 2025 ఈ సంవత్సరం చివర్లో జరుగుతుంది. ఇది భారతదేశం యొక్క మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం దీనిని 'క్రియేట్ ఇన్ ఇండియా' క్యాంపెయిన్ కింద ప్రోత్సహిస్తోంది.WAVES సమ్మిట్ ద్వారా భారతదేశం యొక్క బాలీవుడ్, OTT, గేమింగ్ మరియు డిజిటల్ కంటెంట్ పరిశ్రమలను ప్రపంచ స్థాయికి తీసుకురావాలని ప్రణాళిక చేస్తున్నారు.

WAVES సమ్మిట్ 2025 సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు?

ఈ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, అలాగే బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, మోహన్ లాల్, రజనీకాంత్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్ మరియు దీపికా పదుకొనే పాల్గొన్నారు.