సుప్రీంకోర్టు సమయం వృధా: ‘ఇండియా: మోడీ క్వశ్చన్’ బీబీసీ సిరీస్ నిషేధ వ్యతిరేక పిల్పై మంత్రి కిరణ్ రిజిజు
New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ పై బీబీసీ తీసిన మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారంలో విచారించనుంది. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, ఆ సమయంలో రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ తీరుపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్ (ఇండియా: ది మోడీ కొశ్చన్) దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Law Minister Kiren Rijiju-BBC Series: 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. సోషల్ మీడియాలో 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' డాక్యుమెంటరీని బ్లాక్ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎన్ రామ్, ప్రముఖ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వేలాది మంది సామాన్య పౌరులు న్యాయం కోసం ఎదురుచూస్తూ తేదీల కోసం ఎదురుచూస్తున్న సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని ఇలా వృథా చేస్తున్నారని కిరణ్ రిజిజు అన్నారు.
ఎన్.రామ్, ప్రశాంత్ భూషణ్ తరఫు న్యాయవాది ఎంఎల్ శర్మ, సీనియర్ అటార్నీ సీయూ సింగ్ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై ఆయా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని కోరింది. వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీకి లింకులు ఉన్న పలు యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్టులను బ్లాక్ చేయాలని కేంద్రం జనవరి 21న ఆదేశాలు జారీ చేసింది. బీబీసీ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఈ డాక్యుమెంటరీ కఠినంగా పరిశోధించబడిందనీ, అలాగే, బీజేపీ ప్రితిస్పందనలతో సహా అనేక రకాల అభిప్రాయాలను కలిగి ఉంది. ఈ పిటిషన్లను వచ్చే వారంలో సుప్రీంకోర్టు విచారిస్తుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
సుప్రీంకోర్టు పిటిషన్లలో ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో డాక్యుమెంటరీ లింకులను తొలగించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్, జర్నలిస్ట్ ఎన్ రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్ ను ఈ వారం తర్వాత పరిగణనలోకి తీసుకోనున్నారు. అడ్వకేట్ శర్మ తన పిల్లో ఓ రాజ్యాంగపరమైన ప్రశ్నను లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద రాష్ట్రపతి ఎమర్జెన్సీని విధించనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రావిజన్స్ను ఉపయోగించవచ్చునా? అని ప్రశ్నించారు. ఆర్టికల్ 19(1)(2) కింద దేశ పౌరులు గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వార్తలు, వాస్తవాలు, నివేదికలను చూసే హక్కును కలిగి ఉండరా? అనే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించాలని కోరారు.
కాగా, బీబీసీ సిరీస్ నిషేధానికి నిరసనగా, భారతదేశం అంతటా విద్యార్థి సంఘాలు-ప్రతిపక్ష పార్టీలు డాక్యుమెంటరీ బహిరంగ ప్రదర్శనలను నిర్వహించాయి. పలు కళాశాలల్లో విద్యార్థులు కళాశాల అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగగా కొందరిని కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన దర్యాప్తులో 2012లో ప్రధాని మోడీ పాత్ర నిర్దోషిగా తేలడంతో ఆయన నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ గత ఏడాది తిరస్కరణకు గురైంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ డాక్యుమెంటరీని పరువు పోగొట్టుకున్న కథనాన్ని ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రచార భాగంగా గతవారం అభివర్ణించింది.