అతి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కిషన్గఢ్ టోల్ప్లాజాలోని ఓ బూత్ను ఢీకొంది. అనంతరం ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఓ బీరు బాటిళ్ల లారీ బీభత్సం సృష్టించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కిషన్గఢ్ లో చోటుచేసుకుంది. జయపుర-అజ్మేర్ జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి కిషన్గఢ్ టోల్ప్లాజాలోని ఓ బూత్ను ఢీకొంది. అనంతరం ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
#WATCH A truck rams into toll plaza in Rajasthan's Kishangarh; One person was injured in the incident (21.09.2018) (Source: CCTV footage) pic.twitter.com/GcG8v3dIly
— ANI (@ANI) September 22, 2018
దీంతో టోల్ప్లాజా శకలాలతోపాటు ఆ ట్రక్కులో ఉన్న బీరు బాటిళ్ల పెట్టెలు ముందున్న వాహనంపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే టోల్ప్లాజా సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టోల్ప్లాజా దెబ్బతింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో నమోదయ్యాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 22, 2018, 12:34 PM IST