అయోధ్య రామాలయం : రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు, విరాళాలివ్వండి అంటూ క్యూఆర్ కోడ్ .. మోసపోవద్దన్న వీహెచ్పీ
కోట్లాది మంది భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ మరికొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్రమార్కులు దీనిని కూడా వదలడం లేదు. రామాలయానికి విరాళాల పేరుతో భక్తులను దోచుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
![VHP warns devotees of QR code scam ahead of Ram Mandir consecration event in Ayodhya ksp VHP warns devotees of QR code scam ahead of Ram Mandir consecration event in Ayodhya ksp](https://static-ai.asianetnews.com/images/01hjv7m1rrkg0qrzeyraavthfw/asianet-news---2023-12-29t220918-889_363x203xt.jpg)
కోట్లాది మంది భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ మరికొద్దిరోజుల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్రమార్కులు దీనిని కూడా వదలడం లేదు. రామాలయానికి విరాళాల పేరుతో భక్తులను దోచుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్, ఇతర విధానాలను అనుసరిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) భక్తులను హెచ్చరించింది.
అయోధ్య ఆలయ నిర్మాణానికి సంబంధించి భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ . విరాళాలు సేకరించేందుకు ఎవ్వరికీ అనుమతి లేదని వీహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం రామాలయం పేరుతో ఫేక్ పేజీలు సృష్టిస్తున్నారని గుర్తించామని బన్సాల్ పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్, యూపీఐల ద్వారా ఆలయానికి విరాళాలు ఇవ్వాలని అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని వినోద్ బన్సాల్ స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా భక్తులు అప్రమత్తంగా కోరినట్లు సూచించారు.
అయోధ్యలో డిజిటల్ లావాదేవీల పెరుగుదల :
నగర ప్రస్తుత నిర్మాణ విజృంభణలో సరయూ నది వెంబడి విస్తరించిన రోడ్లు, బహుళ స్థాయి కార్ పార్క్లు, పునర్నిర్మించిన దేవాలయాలు, మెరుగైన ఘాట్లు వున్నాయి. ఈ ట్రాన్స్మిషన్ ఒకప్పుడు ప్రశాంతంగా వున్న పట్టణాన్ని మేల్కోల్పడమే కాకుండా డిజిటల్ చెల్లింపుల వైపు గుర్తించదగిన మార్పుతో ఆర్ధిక కార్యకలాపాల్లో పెరుగుదలను కూడా రేకెత్తించింది. అయోధ్య అంతటా డిజిటల్ లావాదేవీలు ప్రబలంగా మారాయి. స్థానిక విక్రేతలు, నివాసితులు ఇది సులభతరం చేసింది. సరయూ నదిలో నావిగేట్ చేసే బోట్మెన్ (పడవ నడిపే వ్యక్తులు) నుంచి హనుమాన్ గర్హి వద్ద దుకాణదారులు డిజిటల్ చెల్లింపు పద్ధతులను అవలంభిస్తున్నారు.
యూపీఐ, క్యూఆర్ కోడ్ , ఆన్లైన్ చెల్లింపుల ద్వారా అయోధ్యలో అతుకులు లేని లావాదేవీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నదీ తీరాల వెంబడి వున్న దుకాణదారులు చెల్లింపులను ఆమోదించడానికి క్యూఆర్ కోడ్లను స్వీకరించారు. కనక్ భవన్లో సాయంత్రం ఆరతి సమయంలోనూ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు అందజేస్తున్నారు భక్తులు. శ్రీరామ జన్మభూమి మందిర్కు కూడా రూ.2 వేలకు పైన వుండే విరాళాలను క్యూఆర్ కోడ్ ద్వారా ఇచ్చేందుకు వీలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
డిజిటల్ చెల్లింపుల వైపు అయోధ్య ప్రస్థానం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, డిజిటల్ ఇండియా విజన్ సహా ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా వుంది. భారత ఆర్ధిక వ్యవస్ధ డిజిటల్ పరివర్తనకు దోహదపడే కేంద్ర పథకాల గురించి మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్ రావ్ కరద్ డిజిటల్ చెల్లింపు లావాదేవీలలో గణనీయమైన పెరుగుదలను హైలైట్ చేశారు. దీని వార్షిక వృద్ధి రేటు 45 శాతం కాగా.. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు 12,020 కోట్లను అధిగమించాయి. నగదు రహిత ఆర్ధిక వ్యవస్ధ వైపు గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.