వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన ఎనిమిదేళ్లకు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఎందుకలా... 

కేరళ : వెంజరమూడులో ఓ జంట వెడ్డింగ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత వరుడు ఈ ప్రత్యేక బహుమతితో వధువుని ఆశ్చర్యపరిచాడు. అనీష్, డాక్టర్ వైయస్ రజిత వారి ఏడే జెళ్ల కుమార్తె అమ్ము సాక్షిగా తమ పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించారు. ఈ జంట 29 డిసెంబర్ 2014 న పెళ్లి చేసుకున్నారు. రంజిత ఎంకామ్ చదువుతుండగా, అనీష్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. అందుకని అనీష్ బంధువులు రజిత తల్లిదండ్రులను కలిశారు.

అయితే, రజిత కుటుంబీకులు ఈ పెళ్ళిని వ్యతిరేకించారు. కానీ ఓ కండిషన్ పెట్టారు. ఎలాంటి పెళ్లి ఆచారాలు లేకుండా రజితను కట్టుబట్టలతో ఇంటికి తీసుకువెళ్లాలని అనీష్ బంధువులను కోరారు. దాంతో ఆ మరుసటి రోజే అనీష్ తల్లి, సోదరి కలిసి వచ్చి రజితను తమ ఇంటికి తీసుకు వెళ్లారు. సాయంత్రం కీజాయికోణంలోని ఓ ఆడిటోరియంలో వరుడి స్నేహితులు, బంధువుల సమక్షంలో అనీష్, రజిత సింపుల్గా పెళ్లి చేసుకున్నారు.

జీవితంలో విజయం కోసం వారి పోరాటానికి అది నాంది. తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే రజిత ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచాడు అనిష్, ఆమె కామర్స్లో పీహెచ్డీ చేసి కిలిమానూర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పని చేసింది. అయితే, రజితలో ఏదో తెలియని అసంతృప్తి కనిపించేది. ఎప్పుడు ఏ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నా భార్య మొహం దుఃఖంతో వాలిపోవడం గమనించాడు అనీష్. ఆమె కలర్ఫుల్ ఈవెంట్స్ ని, అలాంటి సన్నివేశాల ఆనందాన్ని చూస్తూ కలత చెందుతుంది అని అతనికి అర్థమైంది. వారు పారిపోకపోయినా, అనీష్ బంధువులు ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నప్పటికీ, అందమైన వధువుగా అలంకరించుకోవాలి అనేది రజిత కల. తనకు ఇలాంటి నిరాడంబరమైన పెళ్లి రోజు రావడం తన విధి అని కూడా ఆమె నమ్ముతుండేది.

వారి పెళ్లి రోజున అన్ని ఫోటోలు, వీడియోలలో రజిత విచారంగా, దిగులుగా కనిపించింది. అయితే ఆ జ్ఞాపకాలు ప్రత్యేకంగా ఉండడంతో ఈ జంట ఆల్బమ్ ను అలాగే ఉంచారు. ఆ ఫోటోలను చూసినప్పుడల్లా తమకు ఎంతో బాధగా ఉంటుందని అంటున్నారు. అనీష్ తన భార్య ఎదురుచూస్తున్న అందమైన మరపురాని పెళ్లిరోజును ఎలా బహుమతిగా ఇవ్వాలో అర్థం కాలేదు. రచయిత, సామాజిక కార్యకర్త అయిన అనీష్ తన గందరగోళాన్ని తోటి సామాజిక కార్యకర్త మీరా అజిత్ కుమార్ తో పంచుకున్నారు. దాంతో ఆమె ఒక ఐడియా ఇచ్చింది. వెంటనే వారికి వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.

అనీష్, రజిత వధూవరులుగా ముస్తాబయ్యారు. కానీ, ఈసారి మాత్రం రజిత ముఖంలో చిరునవ్వు మెరుస్తుంది. తిరువనంతపురం లోని అట్టుకల్ దేవాలయం, శంఖుముఖం బీచ్ తో సహా వివిధ ప్రదేశాలలో సేవ్ ది డేట్, ఫ్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ జరిగింది. అందంగా తీసిన ఫోటోలు డిజిటల్ ఆల్బమ్ గా మారాయి. ఆ జంట ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఆల్బమ్ తయారయింది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు సూపర్ హిట్ అయ్యాయి.

అనీష్ తన భార్య కోసం ఒక అందమైన కవిత కూడా రాశాడు. అందులో అతను ఆమెను తన జీవితపు ప్రేమ అని పిలుస్తాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… అనీష్ పదిహేనేళ్లలోపు శారీరకంగా వికలాంగులైన పిల్లలకు సహాయం మద్దతును అందించి స్నేహ యాత్ర అనే స్వచ్ఛంద సంస్థను వలియాకొట్టక్కల్ లో నిర్వహిస్తున్నాడు. అతను స్నేహ యాత్ర అనే మారుపేరుతో కూడా రాస్తాడు. ఈ బృందం వరదల సమయంలో చురుకుగా ఉండి, అవసరమైన వారికి అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించి వేరే సంస్థలను కూడా అనీష్ సమన్వయం చేస్తాడు.