Asianet News TeluguAsianet News Telugu

ఆలయంలోకి దూరిన మొసలి.. పూజారి వేడుకోవడంతో...

గుడిలో ఇచ్చే ప్రసాదం తప్ప మరే ఆహారాన్ని అది ముట్టదు. గతంలో ఆ మొసలి ఆలయం లోపలికి ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ చెప్పారు. 

Vegetarian croc makes surprise entry into kerala temple, retreats after request from priest
Author
Hyderabad, First Published Oct 22, 2020, 2:30 PM IST

ఇటీవల దేశవ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ వర్షాలకు చాలా ప్రాంతాలో మునిగిపోయాయి. ఈ క్రమంలో ఓ లోతట్టు ప్రాంతంలోని ఆలయంలోకి మొసలి దూరింది. కాగా.. దానిని కూడా దేవుడిగా భావించిన ఆలయ పూజారి.. దానిని వేడుకోగా.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కసరగడ్ జిల్లాలోని అనంతపుర ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో ఒక శాఖాహార మొసలి ఉంది. దానిని బలియా అని పిలుస్తారు. చాలాకాలంగా అది ఆ ఆలయానికి పహారా కాస్తోంది. గుడిలో ఇచ్చే ప్రసాదం తప్ప మరే ఆహారాన్ని అది ముట్టదు. గతంలో ఆ మొసలి ఆలయం లోపలికి ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ చెప్పారు. 

ఈ మొసలి గర్భగుడిలోకి ప్రవేశించిందని కొందరు చేసే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. కాగా ఈ మొసలి ఆలయానికి పహారా కాయడం వెనుక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. 70 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో ఉన్న మొసలిని చంపేశాడట. తరువాత ఆ సైనికుడు పాము కాటుకు గురై చనిపోయాడట. ఆ దైవమే అతన్ని చంపిందని స్థానికులు అంటుంటారు. అయితే ఆ మొసలి మృతి చెందిన కొద్ది రోజులకే మరో మొసలి ఆ సరస్సులోకి వచ్చి చేరింది. ఇప్పుడది ఆలయానికి కాపలా కాస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios