జ్ఞానవాపి మసీదు సముదాయంలోని శాస్త్రీయ సర్వేను పూర్తి చేసి నివేదికను సమర్పించేందుకు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కి వారణాసి కోర్టు శుక్రవారం ఎనిమిది వారాల సమయం ఇచ్చింది. 

జ్ఞాన్‌వాపి మసీదు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని శాస్త్రీయ సర్వేను పూర్తి చేసి నివేదికను సమర్పించేందుకు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కి వారణాసి కోర్టు శుక్రవారం మరో ఎనిమిది వారాల గడువు ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది రాజేష్ మిశ్రా తెలిపారు. జిల్లా జడ్జి ఎకె విశ్వేష్ మసీదు నిర్వహణ కమిటీ అభ్యంతరాన్ని తోసిపుచ్చారు. ఎఎస్‌ఐకి అదనపు సమయాన్ని కేటాయించారని మిశ్రా తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

17వ శతాబ్దపు మసీదు హిందూ దేవాలయ పూర్వ నిర్మాణంపై నిర్మించబడిందో లేదో తెలుసుకోవడానికి ASI ఇక్కడ కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వును సమర్థించిన తర్వాత ఈ సర్వే ప్రారంభమైంది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్య అవసరం, హిందూ, ముస్లిం వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తీర్పు చెప్పింది.

ఈ తరుణంలో హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ మాట్లాడుతూ వాజూ ఖానా మినహా జ్ఞానవాపీ కాంప్లెక్స్‌ను సర్వే చేసి నివేదిక సమర్పించేందుకు సెప్టెంబర్ 4 వరకు కోర్టు గడువు ఇచ్చిందని తెలిపారు. సర్వే పనులు పూర్తి కాకపోవడంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు న్యాయవాది సర్వే పనులు పూర్తి చేసేందుకు అదనంగా ఎనిమిది వారాల సమయం కావాలని కోరారు.

గత విచారణ సమయంలో ముస్లిం పక్షం తన అభ్యంతరాన్ని సమర్పించింది. శిధిలాలు లేదా చెత్తను తొలగించడం ద్వారా ప్రాంగణాన్ని సర్వే చేయడానికి ASI బృందానికి అధికారం లేదని చెప్పారు. జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని బేస్‌మెంట్‌తో పాటు ఇతర ప్రదేశాలలో అనుమతి లేకుండా ఏఎస్‌ఐ తవ్వుతున్నారని, నిర్మాణం యొక్క పశ్చిమ గోడపై శిధిలాలు పేరుకుపోతున్నాయని, దీనివల్ల నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని ముస్లిం పక్షం ఆరోపించింది.

ఇదిలా ఉంటే.. ASI సర్వే పని ఆగస్టు 4న పునఃప్రారంభమైంది. వారణాసి కోర్టు అదే రోజు ASIకి సర్వేను పూర్తి చేయడానికి అదనపు నెలను మంజూరు చేసింది. దాని అసలు గడువును ఆగస్టు 4 నుండి సెప్టెంబర్ 4 వరకు పొడిగించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై మసీదు పక్షం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఏఎస్‌ఐ సర్వేపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఆగస్టు 4న సుప్రీంకోర్టు నిరాకరించింది.

అయితే సర్వే సమయంలో ఎలాంటి దురాక్రమణ చర్యలు చేపట్టవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే, వారణాసి కోర్టు తవ్వకాలు జరపవచ్చని తెలిపింది.