రాజస్తాన్లోని అల్వార్ జిల్లాలో వందే భారత్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. ఆ గేదె గాల్లోకి ఎగిరి సమీపంగానే ఉన్న ఓ వ్యక్తిపై పడింది. సదరు వ్యక్తి స్పాట్లోనే మరణించాడు.
జైపూర్: రాజస్తాన్లో దుర్ఘటన జరిగింది. మరోసారి వందేభారత్ అవాంఛనీయ కారణాలతో వార్తల్లోకి ఎక్కింది. రాజస్తాన్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. వందేభారత్ ట్రైన్ అప్పుడు వేగంగా వెళ్లుతున్నది. అదే వేగంతో గేదెను ఢీకొట్టడంతో అది గాల్లోకి ఎగిరింది. అక్కడే సమీపంలో ఉన్న వ్యక్తి మీద ఆ గేదె పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
రాజస్తాన్లోని అజ్మేర్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సేవలు అందిస్తున్నది. ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి అజ్మేర్కు వస్తుండగా నిన్న దుర్ఘటన జరిగింది. అల్వార్ జిల్లాలోని కాలిమోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకెళ్లుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. వందే భారత్ ట్రైన్ అధిక వేగంతో ఉండటంతో ఆ గేదె గాల్లోకి ఎగిరింది. అదే సమయంలో స్పాట్కు సమీపంలోనే ఓ వ్యక్తి ఉన్నాడు.
ఆ గేదె ఎగిరి సదరు వ్యక్తిపై పడిపోయింది. దీంతో ఆ వ్యక్తి స్పాట్లోనే మరణించాడు. మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి అయిన శివ దయాల్గా పోలీసులు గుర్తించారు.
శివ దయాల్ మృతదేహాన్ని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఈ ఘటన గురించి శివ దయాల్ కుటుంబానికి సమాచారం అందజేశారు.
రాజస్తాన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే.
