ప్రమాదం జరిగిన ప్రాంతంనుంచి.. విజయవంతంగా వెళ్లిన వందేభారత్ హై స్పీడ్ ట్రైన్..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలంలో ఉన్నారు. సెమీ-హై స్పీడ్ రైలు వెళ్ళినప్పుడు డ్రైవర్లకు చేయి చూపినట్లు అధికారులు తెలిపారు.
ఒడిశా : ఒడిశాలో ట్రిపుల్ రైలు ప్రమాదం తర్వాత తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలు - హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెల్లింది. ప్రమాదం తరువాత పునరుద్ధరించబడిన ట్రాక్లపై ఈ ఉదయం బాలాసోర్ గుండా ఈ హై స్పీడ్ ట్రైన్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఉదయం 9:30 గంటలకు బహనాగ బజార్ స్టేషన్ను దాటినట్లు వారు తెలిపారు.
ఆ సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలంలో ఉన్నారు. సెమీ హైస్పీడ్ రైలు వెళ్ళినప్పుడు డ్రైవర్లకు చేయి ఊపినట్లు అధికారులు తెలిపారు. అప్ లైన్, డౌన్ లైన్ ట్రాక్ల పునరుద్ధరణ పనులు ఆదివారం రాత్రి పూర్తయ్యాయని వైష్ణవ్ తెలిపారు.
ఆదివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో వైజాగ్ పోర్టు నుంచి రూర్కెలా స్టీల్ ప్లాంట్కు బొగ్గుతో కూడిన గూడ్స్ రైలు ట్రాక్పై పరుగెత్తింది. అదే ట్రాక్పై గూడ్స్ రైలు నడిచింది. ప్రమాద స్థలం గుండా రైళ్లు తక్కువ వేగంతో వెళ్తున్నాయి.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ జూన్ 2వ తేదీ రాత్రి 7 గంటలకు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది, ఆ రైలు కోచ్లు కొన్ని పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ మీద వెడుతున్న బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పిన కొన్ని కోరమాండల్ కోచ్లు పడ్డాయి. దీంతో ఆ రైలులోని కొన్ని కోచ్లు బోల్తా పడ్డాయి.
మూడు రైళ్ల ప్రమాదంలో మానవ తప్పిదం, సిగ్నల్ వైఫల్యం, ఇతర కారణాలను పరిశోధకులు పరిశీలిస్తున్నారు.