Uttarakhand: చార్ధామ్ యాత్రలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల్లో ఎక్కువ గుండె సంబంధ వ్యాధులకు గురైన వారు ఉన్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే.. యాత్ర మార్గంలో వైద్య సేవలు కాస్త మెరుగుపడ్డాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Char Dham Yatra deaths : ఈ ఏడాది మే 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ యాత్రలో మొత్తం 91 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం నాడు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హెల్త్ శైలజా భట్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ఈ సారి చార్ధామ్ యాత్రలో యాత్రికులు ప్రాణాలు కోల్పోవడానికి గుండెపోటు ప్రధాన కారణంగా ఉందని తెలిపారు. చార్ధామ్ యాత్రలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల్లో ఎక్కువ గుండె సంబంధ వ్యాధులకు గురైన వారు ఉన్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే.. యాత్ర మార్గంలో వైద్య సేవలు కాస్త మెరుగుపడ్డాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
"చాలా మంది యాత్రికులు గుండెపోటు కారణంగా మరణించారు. అలాగే, చార్ ధామ్లో ఆరోగ్య సేవలు మునుపటితో పోలిస్తే బలోపేతం చేయబడ్డాయి" అని శైలజా భట్ చెప్పారు. అదనంగా 169 మంది వైద్యులను నియమించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో అక్షయ తృతీయ సందర్భంగా మే 3న భక్తుల కోసం గంగోత్రి మరియు యమునోత్రి పోర్టల్లను తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. మే 6న కేదార్నాథ్ తెరుచుకోగా, మే 8న బద్రీనాథ్ తలుపులు తెరుచుకున్నాయి. చార్ధామ్ యాత్ర నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరీ ముఖ్యంగా గతంలో పోలిస్తే ఈ సారి వైద్య సేవలు మెరుగుపడ్డాయని పేర్కొంటున్నారు. చార్ ధామ్ యాత్ర మార్గంలో భక్తుల కోసం ప్రయివేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందించే ఉచిత ఆరోగ్య సేవలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం (మే 2) జెండా ఊపి ప్రారంభించారు. చార్ ధామ్ యాత్ర మే 3 నుంచి ప్రారంభం అయింది. భక్తులకు ఉచిత ఆరోగ్య సేవలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మీడియాతో మాట్లాడుతూ.. "చార్ ధామ్ యాత్ర ప్రజలకు సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుందని మరియు యాత్ర అంతటా వారు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరకుకుంటున్నాము. సామాజిక సంస్థకు చెందిన వైద్యులు మరియు నర్సుల బృందాలు ఈ సమయంలో భక్తులకు ఆరోగ్య సేవలను రాష్ట్రవ్యాప్తంగా యాత్ర అందిస్తాయి" అని తెలిపారు.
చార్ ధామ్ యాత్రకు పెద్ద ఎత్తున భక్తుల వచ్చే అవకాముందనీ, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుటున్నామని తెలిపారు. చార్ ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల రోజువారీ పరిమితిని నిర్ణయించింది. బద్రీనాథ్ వద్ద రోజుకు 15,000, కేదార్నాథ్కు 12,000, గంగోత్రికి 7,000 మరియు యమునోత్రికి 4,000 మంది యాత్రికులను అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏర్పాటు 45 రోజుల పాటు ఉంటుందని తెలిపింది. అలాగే, ఇక్కడకు వచ్చే యాత్రికులు ఈ సంవత్సరం కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదా కోవిడ్-19 టీకా సర్టిఫికేట్ తీసుకెళ్లడం తప్పనిసరి కాదని పేర్కొంది. ఉత్తరాఖండ్ వెలుపలి నుండి వచ్చే ప్రయాణికులు మరియు యాత్రికుల కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించడంలో గందరగోళాన్ని తొలగించడానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు అంతకుముందు చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
