Mirzapur: మిర్జాపూర్లోని డివిజనల్ ఆస్పత్రిలోని క్లీనింగ్ సిబ్బంది మూడు నెలల గర్భిణిపై ఆమె వార్డులోని బాత్రూమ్లో అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Pregnant woman raped: ఉత్తరప్రదేశ్ మహిళల రక్షణలేకుండా పోతున్నది. వరుసగా మహిళలపై చోటుచేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లోని ఓ ఆసుపత్రిలో క్లీనింగ్ సిబ్బంది ఓ గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ వాష్రూమ్కి వెళ్లగా, నిందితుడు తనపై బలవంతంగా లైంగికదాడి చేశాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు జిల్లా ఆసుపత్రి అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన మే 7వ తేదీ రాత్రి మిర్జాపూర్లోని డివిజనల్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మూడు నెలల గర్భిణి అయిన ఆ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య బాధితురాలు తన వార్డులోని వాష్రూమ్కు ఆస్పత్రిని శుభ్రం చేస్తుండగా వెళ్లింది.
ఈ క్రమంలోనే అక్కడ ఓ వ్యక్తి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాడు. ఆ దుర్మార్గుడు గర్బిణీపై లైంగకదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక కార్మికుడు బాత్రూమ్లోకి ప్రవేశించి, ఆమెను బట్టలు విప్పి.. దూరంగా విసిరేశాడు. "ఇప్పుడు బట్టలు లేకుండా ఎక్కడికి వెళ్తావు?" అంటూ అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమె నోరు మూయించి బలవంతంగా అత్యాచారం చేశాడు. చివరకు ఆమె కేకలు వేయడంతో, బాధితురాలి మాటలు విన్న తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న ఇతర మహిళలు చూసేలోపే నిందితుడు తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది.
బాధితురాలు భర్తతో కలిసి.. జిల్లా మహిళా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దీంతో వారు జరిగిన మొత్తం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు మరియు ఆమె భర్త నుండి సంఘటన గురించి ఆరా తీయడానికి ఆసుపత్రి అధిపతి ప్రవీణ్ కుమార్ మరియు పోలీసు సూపరింటెండెంట్ (SP) అజయ్ కె సింగ్ కూడా చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో లభ్యమైందని, నిందితుడిని పట్టుకునేందుకు బృందాన్ని ఏర్పాటు చేశామని కుమార్ తెలిపారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP), సంజయ్ కుమార్ వర్మ మాట్లాడుతూ.. “కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాము. త్వరలో అరెస్టు చేస్తాం'' అని తెలిపారు.
ముజఫర్పూర్లో 15 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం..
ఇదిలావుండగా, సోమవారం ముజఫర్పూర్లో 15 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా నలుగురు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అనంతరం ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. బాలిక వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నలుగురు వ్యక్తులు ఆమెను దారుణంగా కొట్టారు. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుల్లో ఒకరు బాలికను అనుసరించి వేధించేవాడు. ఫోన్ కాల్స్ మాట్లాడాలని ప్రధాన నిందితుడు బాలికను బలవంతం చేశాడు. తాను చెప్పినట్టు వినకపోతే కుటుంబాన్ని చంపేస్తానని కూడా బెదిరించాడు అని తెలిపింది.
