అయోధ్య రామమందిరంపై దాడికి పాక్ ఉగ్రవాదుల కుట్ర.. నిఘా హెచ్చరికలు
Ayodhya: అయోధ్య రామమందిరంపై దాడి చేయడానికి పాకిస్తాన్ కేంద్రంగా టెర్రర్ కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాల నివేదికలు హెచ్చరించాయి. ఈ దాడి కోసం నేపాల్ మీదుగా భారత్కు ఆత్మాహుతి దళాన్ని పంపేందుకు ఉగ్రవాద సంస్థ ప్రయత్నిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరంపై దాడికి పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నట్లు నిఘా సంస్థలకు సమాచారం అందిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కుట్ర ప్లాన్లో ఆత్మాహుతి బాంబర్ని ఉపయోగించుకుని దాడికి పాల్పడటానికి వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ దాడి కోసం నేపాల్ మీదుగా భారత్కు ఆత్మాహుతి దళాన్ని పంపేందుకు ఉగ్రవాద సంస్థ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాల నివేదికలు పేర్కొంటున్నాయని వివిధ మీడియా నివేదికలు నివేదించాయి.
వివిధ మీడియా కథనాల ప్రకారం..
అయోధ్య రామమందిరం కోసం ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంపై ఉగ్రదాడిపై నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. రామమందిరంపై దాడికి ఉగ్రవాదుల కుట్రను బహిర్గతం చేసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు దాడి సమాచారం అందడంతో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబర్తో దాడికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, అయోధ్య రామ మందిర నిర్మాణం దాదాపు 50 శాతానికి పైగా పూర్తయిందని, ఈ ఏడాది చివరికల్లా ఆలయాన్ని సిద్ధం చేస్తామని ఇప్పటికే సంబంధిత వర్గాలు ప్రకటించాయి. ఇలాంటి తరుణంలో ఉగ్రదాడికి సంబంధించిన నిఘా వర్గాలు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు..
రామ మందిరం నిర్మాణం జరుగుతున్న అయోధ్యలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల హెచ్చరిక తర్వాత, ఉత్తర ప్రదేశ్ పోలీసులు మునుపటి కంటే మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఉగ్రవాద ప్రణాళికలు విజయవంతం కాకుండా భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
పాక్ కేంద్రంగా ఉన్న జైషే మహ్మద్ దాడికి కుట్ర పన్నింది..
అయోధ్య రామాలయంపై దాడికి పాకిస్తాన్ కేంద్రంగా టెర్రర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రసంస్థలు కుట్రపన్నుతున్నాయని నిఘా వర్గాల నివేదికలు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో అయోధ్యలోని రామ మందిరంపై దాడికి పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ యోచిస్తున్నట్లు నిఘా సంస్థలకు సమాచారం అందింది. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ దాడికి కుట్ర పన్నినట్లు వర్గాల నుంచి అందిన సమాచారం.
ఉగ్రవాదులు నేపాల్ ద్వారా భారత్లోకి ప్రవేశించే వ్యూహాలు..
అయోధ్య రామాలయం పై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికల్లో భాగంగా ఇతర దేశాల నుంచి భారత్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాల రిపోర్టులు పేర్కొంటున్నాయి. వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి నేపాల్, నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించి దాడికి పాల్పడటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ వ్యక్తులు నేపాల్ మార్గంలో భారతదేశంలో ఆత్మాహుతి దళాన్ని అంటే ఆత్మాహుతి బాంబర్ స్క్వాడ్ను పంపి దాడికి ప్లాన్ చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 13, 2023