UP Elections 2022: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, మార్చిలో జరుగుతాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే, యూపీలోని ప్రధానమైన ఏడు కీలక నియోజకవర్గాలను పరిశీలిస్తే...
UP Assembly Election 2022: యూపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడు దశల్లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరగున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కిపు ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో ఆ ఏడు నియోజకవర్గాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. అందులో యోగి ఆదిత్యానాథ్ బరిలోకి దిగుతున్న గోరఖ్పూర్ అర్భన్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ నియోజకవర్గం కూడా ఉంది.
ఉత్తరప్రదేశ్లోని ఏడు ప్రధాన నియోజకవర్గాలు..
గోరఖ్పూర్ (అర్బన్): ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. యూపీ సీఎంపై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఉపాధ్యక్షుడు ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లాను ఎస్పీ రంగంలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో ఆరో దశలో పోలింగ్ జరగనుంది.
కర్హల్: సమాజ్వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. మెయిన్పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఫిబ్రవరి 14న మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ను బరిలోకి దింపింది.
ఫాజిల్నగర్: బీజేపీ టర్న్కోట్, రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆరో దశలో పోలింగ్ జరగనుంది.
రాంపూర్: సమాజ్వాదీ పార్టీ ఎంపీ మహ్మద్ ఆజం ఖాన్ తన రాంపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. అతను ఫిబ్రవరి 2020 నుండి జైలులో ఉన్నాడు. ఆయన దాదాపు 100 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నాడు, గేదెలు, మేకల దొంగతనం నుండి భూకబ్జా, విద్యుత్ చౌర్యం వరకు అందులో ఉన్నాయి. ఆజం ఖాన్ 1980 నుంచి రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి తొమ్మిది సార్లు గెలుపొందారు. ఈ అసెంబ్లీ స్థానంలో ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఖాన్పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆకాష్ సక్సేనా పోటీ చేస్తున్నారు. ఆజం ఖాన్పై కాంగ్రెస్ పార్టీ కాజిమ్ అలీఖాన్ను రంగంలోకి దించింది.
సువార్: ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్.. సువార్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ టిక్కెట్పై పోటీ చేస్తున్నారు. కాజిమ్ అలీ ఖాన్ కుమారుడు హైదర్ అలీ ఖాన్ నుండి అతనికి గట్టి పోటీ ఉంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ (ఎస్) టికెట్పై హైదర్ పోటీ చేస్తున్నారు. రెండో దశలో ఈ విధానసభ స్థానంలో పోలింగ్ జరగనుంది.
లక్నో (Cantt): లక్నో (Cantt) నుంచి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ను బీజేపీ పోటీకి దింపింది. కాగా, ఎస్పీ నుంచి రాజుగాంధీ పోటీ చేస్తున్నారు. నాలుగో దశలో ఈ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది.
సిరతు: యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సిరతు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎంపై కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ సోదరి పల్లవి పటేల్ను ఎస్పీ రంగంలోకి దింపింది. ఐదో దశలో సిరతులో పోలింగ్ జరగనుంది.
అప్నాదళ్ (ఎస్), నిషాద్ పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ యూపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. సమాజ్వాదీ నేతృత్వంలోని కూటమిలో రాష్ట్రీయ లోక్ దళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అప్నా దళ్ (కామెరావాడి), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, జన్వాది పార్టీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ కేవలం 47 సీట్లు, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ 19 స్థానాల్లో విజయం సాధించింది.
