యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై బాంబులు వేస్తామంటూ బెదిరింపులు.. !
Uttar Pradesh: పోలీసు కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ వాట్సాప్లో ఆగస్టు 2న వచ్చిన మెసేజ్ 3 రోజుల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పై బాంబులు వేస్తానని బెదిరించారు.
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై బాంబులు వేస్తామంటూ ఏకంగా పోలీసు కంట్రోల్ రూం వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ రావడం కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు దీనిపై నిఘా పెట్టారు. వివరాల్లోకెళ్తే.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు సోమవారం సమాచారం అందించారు. ఆగస్ట్ 2న పోలీస్ కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ వాట్సాప్లో ఆయనను చంపేస్తామంటూ ఒక బెదిరింపు సందేశం వచ్చింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసు కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ వాట్సాప్లో ఆగస్టు 2న వచ్చిన మెసేజ్ 3 రోజుల్లో ముఖ్యమంత్రిపై బాంబులు వేస్తానని బెదిరించింది.హెల్ప్లైన్ ఆపరేషన్ కమాండర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంపిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు అన్వేషణ జరుగుతోంది. సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.
ఈ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంపేస్తామంటూ బెదిరింపులు రావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. సీఎం పై బాంబులు వేస్తామంటూ నేరుగా పోలీసులకు బెదిరింపు సందేశాలు పంపిన దుండగులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. నిఘా అధికారులు సైతం దీనిపై విచారణ జరుపుతున్నారని సమాచారం. ముఖ్యమంత్రి యోగికి సైతం భద్రతను మరింతగా పెంచడంతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలావుండగా, మొహర్రం సందర్భంగా రాష్ట్రంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మొహర్రం 10వ రోజైన మంగళవారం లక్నోలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో 3,500 మంది పోలీసులు, మొబైల్ పెట్రోలింగ్ స్క్వాడ్లు, ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (పిఎసి) మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) బృందాలు మోహరించారు. రాష్ట్ర రాజధానితో పాటు అనేక ప్రాంతాల్లో డ్రోన్లతో ఆయా పరిస్థితులను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. అధికారిక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుకార్లను నిరోధించడానికి ప్రత్యేక సోషల్ మీడియా నిఘా సెల్ ఏర్పాటు చేశారు. పశ్చిమ లక్నో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP) S. చినప్ప మాట్లాడుతూ.. "మేము మొత్తం నగరాన్ని ఐదు జోన్లుగా, సున్నితమైన ప్రాంతాల కోసం 18 సెక్టార్లుగా విభజించాము" అని తెలిపారు.
పాతబస్తీలో మాత్రమే ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు 2,500 మంది నాన్ గెజిటెడ్ పోలీసు సిబ్బందిని నియమించినట్లు మరో సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "సివిల్ పోలీసు అధికారులు, సిబ్బంది కాకుండా, PAC, RAFలను కూడా ఈ ప్రాంతంలో ఇబ్బందులను నివారించడానికి మోహరించారు" అని చెప్పారు. వివిధ మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఊరేగింపు సమయంలో ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించేందుకు కొంతమంది పోలీసు సిబ్బంది బాడీక్యామ్లను కలిగి ఉంటారని అధికారి తెలిపారు. అంతేకాకుండా, డ్రోన్లు మొత్తం ప్రాంతంపై వైమానిక నిఘా ఉంచుతాయి. మోటర్సైకిల్ మొబైల్ యూనిట్లు మొహర్రం సమయంలో శాంతిని నిర్ధారించడానికి పాత నగరం మొత్తం గస్తీ నిర్వహిస్తాయని ఆయన తెలిపారు.