భారతదేశం-అమెరికా సంబంధం: జైశంకర్-బ్లింకాన్ మధ్య కీలక భేటీ.. ఏఏ విషయాలు చర్చించారంటే..?
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వాషింగ్టన్లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజకీయ సమన్వయం, ముఖ్యమైన ప్రాంతీయ సమస్యలు, ప్రపంచ సవాళ్లతో సహా అనేక అంశాలపై కూలంకషంగా చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు.
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వాషింగ్టన్లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, భాగస్వామ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే మార్గాల గురించి మాట్లాడామని US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.
అదే సమయంలో నేటి సమావేశంలో ఇరు దేశాల మధ్య రాజకీయ సమన్వయం, ముఖ్యమైన ప్రాంతీయ సమస్యలు, ప్రపంచ సవాళ్లపై సహకారంపై మదింపులు చేసుకున్నామని, అలాగే.. అనేక అంశాలపై వివరంగా చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు.
ఈ సమావేశంలో తాను ఉక్రెయిన్ వివాదం, ఇండో-పసిఫిక్ పరిస్థితిని గురించి ప్రస్తావించినట్టు తెలిపారు. మన జాతీయ, ఆర్థిక, సాంకేతిక భద్రత అన్నీ దగ్గరి సహకారంతో మెరుగుపడతాయనీ, భారతదేశం నూతన జాతీయ విద్యా విధానంపై చాలా ఆసక్తి ఉన్నారని తెలిపారు. భాగస్వామ్యాన్ని విస్తరించడానికి తాము మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు.
అమెరికా సహకారంపై భారత్ ప్రశంసలు
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ భారత్ , యుఎస్ మరింత స్థితిస్థాపకంగా, బలమైన ఒప్పందాలను ప్రోత్సహించడంలో బలమైన ఆసక్తిని కలిగి ఉన్నాయని, దీనికి సంబంధించిన విధాన నిర్ణయాలు, వ్యాపార సంఘాలతో కూడిన ఆచరణాత్మక చర్యలు అవసరమని అన్నారు. దీనిపై దృష్టి సారిస్తున్నామనీ, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అమెరికా నుండి భారత్ కు లభించిన బలమైన సహకారాన్ని తాను అభినందిస్తున్నానని మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు.
సంప్రదాయ పొత్తులకు అతీతంగా ఆలోచించడం ద్వారా భారత్తో అమెరికా సన్నిహితంగా మేగలటం చూస్తున్నానని జైశంకర్ అన్నారు. క్వాడ్ నేడు అద్భుతంగా పని చేస్తోంది. ఇది మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతోంది.
ఇంధన మార్కెట్లలో భారత్ కఠినమైన వైఖరి
జైశంకర్ మాట్లాడుతూ.. మనం సద్వినియోగం చేసుకోగల అనేక ఉత్తమ పద్ధతులు ఉంటాయని అన్నారు. బహుశా మూడవ దేశాలతో కూడా పంచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఇంధన మార్కెట్లలో మృదుత్వం ఉండాలి. ఏదైనా పరిస్థితిని అది మనపై మరియు ఇతర దేశాలపై ఎలా ప్రభావితం చేస్తుందనే దాని ఆధారంగా మనం అంచనా వేయవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తమ శక్తి అవసరాలను ఎలా తీర్చుకోవాలనే దానిపై తీవ్ర ఆందోళన నెలకొంది.
అలాగే.. రక్షణ పరికరాల దిగుమతిపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. గతంలో రష్యా నుంచి మనకు అందిన సర్వీసింగ్ లేదా విడిభాగాల సరఫరా విషయంలో ఎలాంటి సమస్య ఎదురవుతున్నదని అనుకోవద్దనీ, మన సైనిక సామగ్రిని ఎక్కడి నుంచి పొందుతాం అనేది కొత్త సమస్య కాదనీ, భౌగోళిక-రాజకీయ మార్పుల కారణంగా ఇది మారుతూ ఉంటుందని, జాతీయ ప్రయోజనాల కోసం ఒక ఎంపికను చేస్తామని తెలిపారు.
ఉక్రెయిన్ వివాదం, చమురు ధరలపై కూడా జైశంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్ వివాదంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ఈ వివాదం ఎవరికీ ప్రయోజనం కాదని జైశంకర్ అన్నారు. సంభాషణ మరియు దౌత్యానికి తిరిగి రావడం ఉత్తమ మార్గం. చమురు ధరపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు. చమురు ధర మన వెన్ను విరిచేస్తోంది. ఇది పెద్ద ఆందోళనకరమైన విషయమని అని అన్నారు.
ఎఫ్16 ఫైటర్ ప్లేన్పై
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మరింత సామర్థ్యం, అవకాశం, బాధ్యత అవసరమన్నారు. ఇది కేవలం రెండు దేశాల ద్వారా సాధ్యం కాదని అన్నారు. ఎఫ్16 ఫైటర్ ప్లేన్ గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది చాలా కాలంగా పాక్ కు అందిస్తు్నట్టు తెలిపారు. ఇది కొత్తేమీ కాదనీ, అందుకు మనం వారికి సహాయం చేయాలని అన్నారు. ఇతర దేశాలకు కూడా సైనిక సామగ్రిని అందిస్తామననీ, , వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత తమకు ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఎఫ్-16 ప్యాకేజీపై బీజేపీ కేంద్రం మంత్రి జైశంకర్ విరుచుకుపడగా, అమెరికా ఈ క్లారిటీ ఇచ్చింది. బ్లింకెన్ ప్రధాని మోదీ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. ఇది యుద్ధానికి సమయం కాదు. యుద్ధానికి ఎవరూ అంగీకరించలేరని అన్నారు.