కర్ణాటకలో కాంగ్రెస్ దూసుకెడుతున్న వేళ ఈ గెలుపుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రే కారణం అంటూ ఓ టీచర్ ను పార్టీ రిలీజ్ చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 : కర్ణాటకలో స్పష్టమైన మెజార్టీని సాధించిన కాంగ్రెస్ విజయోత్సాహంలో మునిగితేలుతోంది. ఈ విజయాన్ని రాహుల్ భారత్ జోడో యాత్రకు జోడిస్తూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీని చూపిస్తున్నాయి. ప్రత్యర్థి బిజెపి కంటే ముందంజలో ఉంది. ఈ ఘటనతను పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాన్-ఇండియా పాద యాత్ర "భారత్ జోడో యాత్ర" వల్లే అనేలా ఓ వీడియోను పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అన్ స్టాపబుల్ అనే ఇంగ్లీష్ పాటతో తయారు చేసిన.. ఈ టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ ఉదయం భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ఫొటోలతో వీడియో మాంటేజ్ను పోస్ట్ చేసింది, ప్రముఖ ఆంగ్ల పాట "అన్స్టాపబుల్" బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతోంది.
"నేను అజేయంగా ఉన్నా..
ఎంతో నమ్మకంతో ఉన్నా...
అవును, ఈరోజు నన్నెవరూ ఆపలేరూ.. ' అంటూ సాగే ఇంగ్లీష్ పాటకు రాహుల్ గాంధీ ఫొటోను వీడియో థంబ్నెయిల్గా కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈసారి పార్టీ పనితీరులో కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలోని కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర బాగా తోడ్పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల ఏర్పడిన వాతావరణం ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.
‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కర్ణాటకలో కనిపించిన వాతావరణం నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు అద్భుతంగా పని చేశారు. మతతత్వ రాజకీయాలను తిరస్కరించి కర్ణాటక అభివృద్ధి రాజకీయాలను ఎంచుకుంది. రాబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుంది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.
తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యం కనబరుస్తోంది. అధికార బీజేపీ 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, హెచ్డీ కుమారస్వామికి చెందిన జేడీ(ఎస్) 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చేరుకోవాలని కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలందరినీ కోరింది. కాంగ్రెస్ పార్టీ 120 మార్కును దాటడం ఖాయమని సిద్ధరామయ్య అన్నారు. పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అనేక రిసార్ట్లను బుక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిమీద బిజెపి అపహాస్యం చేసింది. కాంగ్రెస్ "తన ఎమ్మెల్యేలను నమ్మదు" అంటూ కామెంట్స్ చేసింది.
