కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ప్రయాణీస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి.
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో సోమవారం నాడు ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఎల్లాపూర్ నుండి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో శ్రీపాదనాయక్ భార్య మరణించారు.శ్రీపాదనాయక్ వ్యక్తిగత కార్యదర్శి దీపక్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు తెలిపారు.
అంకోలా తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు చెప్పారు. కారు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే గోవా సీఎంతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు.
కేంద్ర మంత్రిని గోవాలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రధాని మోడీ వైద్యులను ఆదేశించారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాాదానికి వేగమే కారణమా.. ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 11, 2021, 10:45 PM IST