కేంద్ర బడ్జెట్ 2019 : కేసీఆర్ తరహా రైతు బంధు పథకం
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది. కేంద్ర్ ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. ఐదెకరాలు ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6 వేలను చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాడు లోక్సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రైతాంగానికి శుభవార్తను అందించారు. తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం తరహాలోనే కేంద్రం కూడ రైతులకు పెట్టుబడి కోసం నిధులను అందించనున్నట్టు ప్రకటించింది. ఎకరానికి రూ.6వేలను పెట్టుబడిగా చెల్లించనుంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పెట్టుబడి సహాయాన్ని అందించనంది.
2018 డిసెంబర్ నుండి ఈ పథకాన్ని అమలు చేస్తామని పీయూష్ గోయల్ ప్రకటించారు. మూడు విడతల్లో రైతాంగానికి సహాయం చేస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.దేశంలోని సుమారు 12 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ది పొందే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది.
ఏపీ రాష్ట్రం కూడ ఇదే తరహా స్కీమ్ను అమలు చేయాలని భావిస్తోంది. తాజాగా కేంద్రం కూడ ఇదే తరహా స్కీమ్ను అమలు చేస్తామని ప్రకటించింది.