మోడీ మంత్రివర్గ విస్తరణ: కిషన్ రెడ్డి సహా ఆ మంత్రులకు ప్రమోషన్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు మంత్రులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది,. సహాయ మంత్రి హోదా నుండి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందంటున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు మంత్రులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది,. సహాయ మంత్రి హోదా నుండి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందంటున్నారు.కిషన్ రెడ్డితో పాటు ప్రస్తుతం సహాయమంత్రులుగా హర్ధీప్ సింగ్, అనురాగ్ ఠాకూర్ , రూపాలా, కిరణ్ రిజుజులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
also read:కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ రాజీనామా !
బుధవారం నాడు మధ్యాహ్నం వరకు పలువురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కొత్తవారికి కేబినెట్ లో అవకాశం కల్పించడం కోసం మంత్రులు రాజీనామాలను సమర్పించారు. ఇవాళ ప్రధానితో కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ తదితరులు భేటీ అయ్యారు. మోడీతో భేటీ అయిన వారికి బెర్త్ ఖరారు అయిందనే ప్రచారం కూడ లేకపోలేదు. వ్యవసాయ శాఖ నుండి సహకార శాఖను ప్రత్యేకంగా విడదీశారు. ఈ శాఖకు వ్రత్యేకంగా మంత్రిని నియమించనున్నారు. కిషన్ రెడ్డికి సహకార శాఖ పోర్టుఫోలియో దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే