శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై మండిపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి పంపిణీపై తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఉంటే, బీజేపీ కార్యకర్తలు ఇతర పార్టీలకు తివాచీలు పరచాల్సిన అవసరం ఉండదని ఉద్ధవ్ అన్నారు

బీజేపీ అనుసరించే 'ఒక దేశం, ఒకే పార్టీ' ప్రణాళికను ఎప్పటికీ అంగీకరించబోమని, ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా క్షీణిస్తోందని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. విదర్బ పర్యటనలో భాగంగా.. యవత్మాల్ జిల్లాలోని డిగ్రాస్‌లో జరిగిన ర్యాలీలో బీజేపీని ఉద్దేశించి ఠాక్రే మాట్లాడుతూ.. ఒక దేశం, ఒకే చట్టం అర్థం చేసుకోవచ్చు. కానీ బిజెపి ఒకే దేశం, ఒక పార్టీ ప్రణాళికను తాము ఎప్పటికీ అంగీకరించమని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విడిపోయిన మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) శివసేనను మాత్రమే కోరుకుంటోందని, కానీ ఠాక్రేలను కాదని మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. మహారాష్ట్రలోని శివసేన-బిజెపి ప్రభుత్వంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపికి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇటీవల చేరికపై స్పష్టమైన సూచనలో థాకరే మాట్లాడుతూ.. బిజెపి ఇప్పుడు రిఫ్-రాఫ్ పార్టీగా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి పంపిణీపై తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఉంటే, బీజేపీ కార్యకర్తలు ఇతర పార్టీలకు తివాచీలు పరచాల్సిన అవసరం ఉండదని ఉద్ధవ్ అన్నారు


ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా మసకబారిపోయిందని ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అందుకు సాక్ష్యమని అన్నారు. ప్రధాని బజరంగ్ బలీ కీ జై అని నినాదించడమేంటనీ ప్రశ్నించారు. ఆ దేవుడు తన గద్దతో తిప్పికొట్టాడు.. కర్నాటకలో కాంగ్రెస్ బీజేపీని వైట్ వాష్ చేసింది అన్నారాయన.