UAPA : నేటీ సమాజంలో ఆ చట్టాల అవసరం చాలా ఉంది: కేంద్ర మంత్రి
UAPA : ప్రజలను రక్షించడానికి UAPA వంటి చట్టాలు అవసరముందనీ, ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడకుండా నియంత్రించవచ్చని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ అన్నారు.
UAPA: ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఎపిఎ) వంటి ప్రత్యేక చట్టాలు అవసరమని కేంద్ర మంత్రి ఆర్కె సింగ్ గురువారం అన్నారు. న్యూఢిల్లీలో 'భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రంలో మానవ హక్కులు' అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏపీఏ వంటి చట్టాలు ఉండాలని, ఉగ్రచర్యలను అరికట్టాలని, ఇతరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులపై యూఏపీఏ కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదం, నక్సలిజం దేశానికి ముప్పుఅని మాజీ కేంద్ర హోం కార్యదర్శి సింగ్ చెప్పారు. తమకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇవ్వగలిగిన పోలీసులు కూడా తమ భద్రతకు భయపడి ఏదైనా చెప్పడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. కాబట్టి, నేర నియంత్రణ చట్టం, UAPA వంటి ప్రత్యేక చట్టాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉన్నారు. దేశానికి తీవ్రవాదం, నక్సలిజం ముప్పుగా తయారయ్యాయని, కాలక్రమేణా రెండింటినీ పరిష్కరించామని ఆయన అన్నారు. మానవత్వం మన డిఎన్ఎలో పొందుపరచబడిందని, మనం భూమిపై అత్యంత సహనం గల వారిమని, ఎప్పుడూ మతాల పట్ల వివక్ష చూపలేదనీ, దేవుళ్లందరినీ గౌరవిస్తామనీ, మత మార్పిడిపై మనకు నమ్మకం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సి చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా కూడా పాల్గొన్నారు. భారతదేశ సహనాన్ని సమర్థిస్తూ.. భారతీయ చరిత్ర, సంస్కృతిలో సమానత్వం, సహనం యొక్క సంప్రదాయాన్ని సూచించడానికి వేదాలు, మహాభారతం, కౌటిల్యుని అర్థశాస్త్రం, అక్బర్ యొక్క దిన్-ఇ-ఇలాహిలను ఉదహరించారు.
శరీరం, ఇల్లు, గౌరవానికి సంబంధించిన హక్కు ఋగ్వేదంలో ఉన్నాయనీ, మహాభారతం, మనుస్మృతి, ఇతర గ్రంథాలను ఉటంకిస్తూ.. యుద్ధం, కాల్పుల విరమణ నియమాలు, పాలకుల హక్కుల రక్షణ, పర్యావరణ స్పృహ, అనేక ఇతర కీలక మానవ హక్కులను చూపారు. పురాతన, మధ్యయుగ గ్రంథాలలో చర్చించబడ్డాయని తెలిపారు. మనలాంటి చరిత్ర, సంస్కృతి ఉన్న దేశాన్ని అసహనంగా పరిగణించలేమని మిశ్రా పేర్కొన్నారు.
అన్ని మతాల సారాన్ని గ్రహించి.. దేవుడు ఒక్కడే అని చాటి చెప్పిన అక్బర్ దిన్-ఇ-ఇలాహీ మన దేశంలోనే అవిర్భవించిందని, ఈ మతం అని మతాలను కలిసి ఉండాలని పేర్కొంటే.. నేటీ సమాజంలో మతాలను విభజించే ప్రయత్నం ఎందుకు జరుగుతోందో తెలియడం లేదనీ, అన్ని మతాలు ఒక్కటేనని చూపించడానికి కొత్త దిన్-ఎ-ఇలాహి అవసరమని NHRC ఛైర్మన్ అన్నారు.
ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడమే: అశోక్ గెహ్లాట్
మంగళవారం ఉదయ్పూర్లో ఒక టైలర్ను నరికి చంపిన నిందితులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్లు 'ఇస్లాం మతాన్ని అవమానించినందుకు' ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశామని ఓ వీడియోలో అంగీకరించడం గమనార్హం. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడమే హత్యకు కారణమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. హంతకులకు విదేశాల్లో కూడా పరిచయాలు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ప్రముఖ ముస్లిం సంస్థలు ఈ హత్యను ఖండించాయి, ఇది ఇస్లాం విరుద్ధమని పేర్కొన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది.