Asianet News TeluguAsianet News Telugu

కాంచీపురం:ఆలయం వద్ద పేలుడు, ఇద్దరు మృతి

కాంచీపురం జిల్లాలోని ఆలయం వద్ద పేలుడు సంబవించింది.ఈ పేలుడులో ఇద్దరు  మృతి చెందారు. 

Two killed four injured in explosion near temple in Tamil Nadus Kanchipuram
Author
Kanchipuram, First Published Aug 26, 2019, 12:14 PM IST

కాంచీపురం: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని మానామది ఆలయం వద్ద ఆదివారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని  ఐబీ హెచ్చరించిన నేపథ్యంలోనే ఆదివారం నాడు ఈ ఆలయం వద్ద పేలుడు సంబవించడంతో  పోలీసు శాఖ అప్రమత్తమైంది.

ఈ ఆలయ కొనులో పూడిక తీత పనుల సమయంలో పేలుడు చోటు చేసుకొంది. ఇదే గ్రామానికి చెందిన సూర్య అనే యువకుడు స్నేహితులతో కలిసి కొలను వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ బాక్స్ లభించింది. దాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి తెరిచారు. దాన్ని తెరవడంతో ఆ బాక్స్  పేలింది.

ఈ శబ్దంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన సూర్యతో పాటు మరో వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు.  వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ పేలుడు దాటికి ఆలయం వద్ద గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. చెంగల్పట్టు, మహాబలిపురం డీఎస్పీలు  బాంబ్ స్వ్కాడ్ లు రంగంలోకి దిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios