Asianet News TeluguAsianet News Telugu

 జమ్మూలోని కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్‌లోని  కుల్గామ్‌లోని అహ్వాటూ ప్రాంతంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో దాక్కున్న జేఎం ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.  ఈ  ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జెఇఎం) ఇద్ద‌రు సభ్యుడు మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

Two Jaish militants killed in Kulgam encounter
Author
First Published Sep 28, 2022, 4:44 AM IST

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్ర‌వాదుల‌కు, భద్రతా బలగాల‌కు మధ్య ఎన్ కౌంట‌ర్  కొనసాగుతోంది. గ‌త 24 గంట‌ల్లో రెండు సార్లు కాల్పులు జ‌రిగాయి. ఈ  ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జెఇఎం) ఇద్ద‌రు సభ్యుడు మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. హతమైన ఉగ్రవాదులను బట్‌పోరాకు చెందిన మహ్మద్ షఫీ గనీ, టాకియా గోపాల్‌పోరాకు చెందిన మహ్మద్ ఆసిఫ్ వానీ అలియాస్ యావర్‌గా గుర్తించారు.

కుల్గామ్‌లోని అహ్వాటూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు  సెర్చ్ ఆపరేషన్ నిర్వ‌హించాయి. ఈ  సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తాబ‌ల‌గాలు.. ఎదురుదాడికి దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.

ఈ క్ర‌మంలో ఎన్‌కౌంటర్ ప్రదేశాల నుండి ఒక AK-56, రెండు AK-47, ఒక పిస్టల్, ఒక గ్రెనేడ్, నాలుగు మ్యాగజైన్‌లు, ఒక పిస్టల్ మ్యాగజైన్‌తో సహా నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు సోమవారం ఒక  జైషే ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదిని పాకిస్థాన్‌కు చెందిన అబూ హురైరాగా గుర్తించారు.  ఈ విధంగా 24 గంటల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున కుల్గామ్‌లోని బత్‌పోరా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పౌరులు, ఒక ఆర్మీ జవాన్ కూడా గాయపడ్డారు. అర్థరాత్రి వరకు ఎన్‌కౌంటర్‌ కొనసాగింది.

 కుల్గామ్‌లోని అహ్వాటూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు.భద్రతా దళాలపై అల్ట్రాలు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios