Asianet News TeluguAsianet News Telugu

పూణెలో దారుణం మైనర్ బాలికలపై అత్యాచారం, ఒకరు మృతి

పూణె లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగిక దాడిలో ఓ బాలిక ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే పూణెలోని హింజవాడీ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని గుడికి వెళ్లారు.

Two Girls, 12, Raped In Pune; One Dies Of Injuries
Author
Pune, First Published Sep 20, 2018, 7:53 PM IST

పూణె: పూణె లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగిక దాడిలో ఓ బాలిక ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే పూణెలోని హింజవాడీ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని గుడికి వెళ్లారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు చాక్లెట్ ఇస్తామని చెప్పి వారిద్దరిని అపహరించుకుపోయారు. 

చాక్లెట్ లకు ఆశపడిన ఆ మైనర్ బాలికలను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారంకు పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని హెచ్చరించడంతో బాలికలు భయంతో ఎవరికి చెప్పలేదు. తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ చెప్పకుండా కుమిలిపోయారు. 

అయితే మైనర్ బాలికలలో ఒకరికి కడుపులో నొప్పి రావడం, నీరసంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే వైద్యులు మైనర్ బాలిక అత్యాచారానికి గురైందని తెలిపారు.  

మైనర్ బాలిక అత్యాచారానికి గురైందని నిర్ధారించిన వైద్యులు వెంటనే హింజవాడీ పోలీసులకు సమాచారం అందిచారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలిక మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. తమ ఇంటిపక్కన ఉన్న మరో అమ్మాయితో కలిసి తమ కుమార్తె గుడికి వెళ్లిందని చెప్పడంతో పోలీసులు ఆ యువతిని ఆరా తీశారు.  

దీంతో ఆ మైనర్ బాలిక జరిగిన ఘోరాన్ని పోలీసులకు వివరించింది. ఆమె స్టేట్ మెంట్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లైంగిక దాడికి పాల్పడ్డ వారిలో ఒకరిని గుర్తించారు. 22ఏళ్ల గణేష్ నికమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

ఇంతలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మైనర్ బాలిక కోమాలోకి వెళ్లిపోయిందని వైద్యులు స్పష్టం చేశారు. వైద్యంకు ఆమె శరీరం సహకరించకపోవడంతో బుధవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. 

అయితే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. గణేష్ నికామ్ తోపాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశామని అతడు మైనర్ అని తెలిపారు. గణేష్ నికామ్ ను కోర్టులో హాజరుపరిచామని అలాగే మైనర్ నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డ్ ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.  

నిందితులపై సెక్షన్ 376 ప్రకారం అత్యాచారం, 363 సెక్షన్ కింద కిడ్నాప్, అలాగే పోస్కో యాక్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios