Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో కలకలం.. చంపేస్తామంటూ మరోనేతకు బెదిరింపులు.. 

శివసేన (యుబిటి) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ను చంపుతామని బెదిరించిన ఇద్దరు అనుమానితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 
 

Two Detained In Connection With Death Threat To Sanjay Raut krj
Author
First Published Jun 10, 2023, 2:24 AM IST

ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, శివసేన ఎంపి సంజయ్ రౌత్, అతని సోదరుడు సునీల్ రౌత్‌లకు హత్య బెదిరింపులు రావడంతో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే.. బెదిరింపులు ప్రభుత్వ ప్రాయోజితమని శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. అదే సమయంలో.. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవడంతో  ముంబై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

వివరాలోకెళ్తే.. ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. అందులో గుర్తు తెలియని వ్యక్తి.. సంజయ్ రౌత్ , అతని సోదరుడు సునీల్ రౌత్‌ను కాల్చివేస్తానని బెదిరించారు. ఈ ఘటనపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ "తనకు 7-8 నెలల్లో 5-6 సార్లు చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల గురించి  రాష్ట్ర హోం మంత్రి , సిఎంకు చెప్పాను." అని అన్నారు. 
 
శరద్ పవార్‌కు బెదిరింపులు రావడంతో కూతురు సుప్రియా సూలే ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఎం విచారణకు ఆదేశించారు. ఉద్ధవ్ వర్గం నాయకుడు సంజయ్ రౌత్‌ను బెదిరించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితుడి విచారణ కొనసాగుతోంది. నిందితుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.  గోవండి తూర్పు శివారులో ఇద్దరినీ పట్టుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  
 
మరోవైపు, సంజయ్ రౌత్‌కు వచ్చిన బెదిరింపుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం ఏదైనా పార్టీ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉందని, ఎవరైనా అనుకుంటే అతను బెదిరింపులతో వాయిస్‌ను మూసేయవచ్చు అనేది అపార్థం. శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యత వహించే పోలీసుల వ్యవస్థ  ఉందనీ, వారి సామర్థ్యాలపై తనకు  పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి.. ఆందోళన చెందనని అన్నారు. 

ఇంతకుముందు శరద్ పవార్‌కు ట్విట్టర్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీనియర్ నేతను బెదిరించిన విషయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, “మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన సంప్రదాయం ఉంది. రాజకీయ స్థాయిలో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ అభిప్రాయాలలో తేడాలు లేవు. ఏ నాయకుడిని బెదిరించడం లేదా సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తపరిచేటప్పుడు మర్యాద హద్దులు దాటితే సహించేది లేదు. అలాంటి సందర్భాలలో, పోలీసులు ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ”అని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios