ఢిల్లీ లో ఎన్ కౌంటర్... ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ హతం
రీసెంట్ గా జరిగిన కారావాల్ నగర్ లో జరిగిన మర్డర్ కేసులో వీరు నింధితులని తెలిపారు. మృతుల శరీరాల్లోకి పోలీసులు 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం ఢిల్లీ పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు వాంటెడ్ క్రిమెనల్స్ హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ నిర్వహించిన ఆపరేషన్ లో రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ అనే ఇద్దరు క్రిమినల్స్ ఎన్ కౌంటర్ అయ్యారు.
Also Read బోర్ వెల్ లో పడిన రోహిత్: ఆరు గంటల శ్రమతో బయటకు...
సోమవారం పొద్దున ఐదు గంటలకు ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారు పలు కేసులలో వాంటెండ్ గా ఉన్నారని అన్నారు పోలీసులు. రీసెంట్ గా జరిగిన కారావాల్ నగర్ లో జరిగిన మర్డర్ కేసులో వీరు నింధితులని తెలిపారు. మృతుల శరీరాల్లోకి పోలీసులు 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
ఢిల్లీమ లోని ప్రహ్లాదపురలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. కాగా... గతేడాది ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో కూడా పోలీసులు ఎన్ కౌంటర్ జరిపినట్లు సమాచారం.