Asianet News TeluguAsianet News Telugu

పత్రికా ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తల దాడి.. నలుగురు జర్నలిస్టులకు గాయాలు...

ఈ సంఘటనలో నలుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. కొంతమేరకు ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనమీద ‘ప్రతివాదీ కలం’ సంపాదకుడు అనల్ రాయ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tripura Shocked As Alleged BJP Workers Attack Daily's Office, Injure Journalists
Author
Hyderabad, First Published Sep 9, 2021, 10:17 AM IST

అగర్తలా : త్రిపుర రాజధాని అగర్తలలో ఒక పత్రికా కార్యాలయంమీద భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఉదంతంలో కొందరు బీజేప నేతల హస్తముందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం పరకారం ‘ప్రతివాదీ కలం’ అనే స్థానిక దినపత్రిక కార్యాలయంమీద దాడి జరిగింది. 

ఈ సంఘటనలో నలుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. కొంతమేరకు ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనమీద ‘ప్రతివాదీ కలం’ సంపాదకుడు అనల్ రాయ్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటన అనంతరం అగర్తల ప్రెస్ క్లబ్ సెక్రటరీ ప్రణబ్ సర్కార్ తో పాటు పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ‘ప్రతివాదీ కలం’ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ దాడులకు పాల్పడ్డవారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అధికార బీజేపీ విపక్ష భారతీయ కమ్యూనిస్టు పార్టీల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios