Asianet News TeluguAsianet News Telugu

మథురలో రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన రైలు..

ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Train climbs on platform at Mathura railway station ksm
Author
First Published Sep 27, 2023, 10:09 AM IST

ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. వివరాలు.. ఉత్తర రైల్వేకు చెందిన షకుర్‌బస్తీ-మథుర MEMU (04446).. రాత్రి 10:48 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. అయితే రైలు గమ్యస్థానం చేరుకున్నాక ప్రయాణికులు అందులో నుంచి దిగిపోయారు. అయితే ఐదు నిమిషాల తర్వాత రైలు.. ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చి.. ఓవర్‌హెడ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 

Train climbs on platform at Mathura railway station ksm

ఈ ఘటన జరిగిన సమయంలో రైలులో లోకో పైలట్లు, ప్రయాణికులు లేరని చెబుతున్నారు. మథుర రైల్వే స్టేషన్‌ అధికారులు మాట్లాడుతూ.. ప్రయాణికులంతా అప్పటికే రైలు దిగిపోయారని చెప్పారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ ఘటనతో అప్‌లైన్‌లో కొన్ని రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios