పదకొండేళ్ల మూగ బాలుడిని వీధి కుక్కుల కరిచి చంపిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి సమీపంలో ఉన్న మైదానంలోకి ఆడుకునేందుకు వెళ్లిన బాలుడిపై కుక్కలు దాడి చేసి హతమార్చాయి.
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కన్నూర్ జిల్లాలో 11 ఏళ్ల మూగ బాలుడిని వీధి కుక్కల గుంపు కరిచి చంపాయి. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలుడు ఆ తర్వాత నిర్మానుష్య మైదానంలో అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆ బాలుడిని కన్నూర్ లోని ముజప్పిలంగాడ్ కు చెందిన నిహాల్ నిషాద్ గా గుర్తించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. ముజప్పిలంగాడ్ ప్రాంతంలో 11 ఏళ్ల నిహాల్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. ఆ బాలుడికి చిన్నప్పటి నుంచే మాటలు రావు. అయితే బాలుడి ఇంటికి దాదాపు అర కిలో మీటరు దూరంలో నిర్మానుష్య మైదానం ఉంది. ఆదివారం ఉదయం పూట మైదానానికి నిహాన్ ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడికి ఓ వీధు కుక్కల గుంపు వచ్చి బాలుడిపై దాడి చేశాయి. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అయితే సాయంత్రం అయినా బాలుడి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల గాలించినా కనిపించకోవడంతో విషయం స్థానికులకు తెలిపారు. దీంతో స్థానికులంతా బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిహాన్ తీవ్ర గాయాలతో మైదానంలో పడి ఉన్నాడు. వారంతా బాలుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే బాలుడి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి.. ఎక్కడంటే ?
కాగా.. వికలాంగుడైన బాలుడి శరీరంపై కాటు గుర్తులు కనిపించాయని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే కేరళలో ఇలా కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. కేరళలోని కోజికోడ్ లో సెప్టెంబర్ 13న జరిగిన మరో ఘటనలో అరకినార్ గ్రామంలో 12 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు కిరాతకంగా దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గ్రామంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది.
