Asianet News TeluguAsianet News Telugu

ఫాస్టాగ్‌కు సిద్ధం కాని వాహనదారులు: టోల్‌ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జాం

ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Traffic jam at toll plazas on NH 65 in view of FASTag
Author
Hyderabad, First Published Dec 15, 2019, 3:17 PM IST

జాతీయ రహదారులపై వున్న టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యాన్ని నివారించడంతో పాటు డిజిటల్ పేమెంట్స్‌ను ప్రొత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ విధానం ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

Also Read:ఆధ్మాత్మిక యాత్రలో రియల్ హీరో: సాహో సజ్జనార్ అంటూ.....

అయితే ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ లేని వాహనదారులు నగదు చెల్లించేందుకు బారులు తీరడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది.

Also Read:చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... ముప్పేటదాడికి కేసులు సిద్ధం

ఫాస్టాగ్‌కు బదులు నగదు చెల్లించి వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద 5 గేట్ల ద్వారా ఫాస్టాగ్, 3 గేట్ల ద్వారా నగదు చెల్లింపు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

అయితే ఈ మూడు గేట్ల వద్ద రద్దీ అధికంగా ఉంది. అటు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. రెండు మార్గాల్లోని ఫాస్టాగ్‌లు పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios