Asianet News TeluguAsianet News Telugu

ముంబై వర్షాలు: ఆనకట్టకు గండి.. 23 మంది గల్లంతు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వర్షాలు వదలడం లేదు. దాదాపు ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం జలసంద్రమయ్యింది.

tiware dam in Ratnagiri was breached
Author
Mumbai, First Published Jul 3, 2019, 8:17 AM IST

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వర్షాలు వదలడం లేదు. దాదాపు ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం జలసంద్రమయ్యింది. దీంతో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు కూలి ఇప్పటికే మహారాష్ట్రలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలో రత్నగిరిలోని తివారి ఆనకట్టకు పడి సమీపంలోని గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ  ఘటనలో ఇద్దరు మరణించగా... 23 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. వరద ఉద్ధృతికి 12 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

Follow Us:
Download App:
  • android
  • ios