Rahul Gandhi: మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  

Rahul Gandhi: మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలాంటి దుర్చ‌ర్య‌ల‌కు లేదా విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ముస్లిం మహిళలను లక్ష్యంగా 'బుల్లీ బాయ్​' యాప్​ పేరుతో దుండగుల వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు. "మహిళలను అవమానించడం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా గొంతు వినిపించినప్పుడే.. అలాంటి దారుణాలు ఆగుతాయి. సంవత్సరం మారింది. పరిస్థితులు కూడా మారాలి. ఇది మాట్లాడాల్సిన సమయం * అంటూ నో ఫియర్ హ్యాస్​ ట్యాగ్​తో రాహుల్​ ట్వీట్ చేశారు.

Read Also : Omicron ఎఫెక్ట్: బెంగాల్‌లో రేపటి నుండి విద్యా సంస్థల మూసివేత

మ‌రో ట్వీట్ లో ప్ర‌ధాని మోడీపై రాహుల్ గాంధీ విమ‌ర్శస్త్రాలు సంధించారు. లద్దాఖ్​, అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దుల్లో చైనా సైన్యం అక్ర‌మ చొరబాట్లకు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. ఇక నైనా మోదీజీ మౌనం వీడాల‌ని సూచించారు. కేంద్ర ప్ర‌భుత్వాని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. గల్వాన్​లో చైనా దురాక్రమణల‌కు పాల్ప‌డుతున్న ప్రధాని మోడీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ఇకనైనా మౌనం వీడి.. వారిని స‌రైన స‌మాధానం చెప్పాలని రాహుల్​ గాంధీ కోరారు. అలాగే.. అరుణాచల్​ ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై రాహుల్​​ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రత, విజయం కోసం స‌రైన స‌మ‌యంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవ‌డం ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని, బూటకపు మాటల వల్ల దేన్ని సాధించలేమ‌ని రాహుల్ గాంధీ అని ట్వీట్​ చేశారు.

Read Also : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 10వ తేదీ వరకు స్కూల్స్ బంద్, స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం

Bulli Bai App లో ముస్లీం మహిళలను లక్ష్యంగా చేసుకుని దుండ‌గులు వికృత చేష్టలకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఈ యాప్ పై దేశ‌వ్యాప్తంగా దూమారం రేగింది. అలాగే పెద్ద ఎత్తున ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఈ యాప్​ను, సైట్​ను తొలగించినట్లు వెల్లడించారు పోలీసులు .